భార్యలు లేని ముసలోళ్లే ఆమె టార్గెట్..11ఏళ్లలో 8 పెళ్లిళ్లు..

  • Published By: nagamani ,Published On : September 11, 2020 / 11:23 AM IST
భార్యలు లేని ముసలోళ్లే ఆమె టార్గెట్..11ఏళ్లలో 8 పెళ్లిళ్లు..

మహిళల్ని మోసం చేస్తు పెళ్లి మీద పెళ్లి చేసుకునే నిత్యపెళ్లికొడుకులనే ఇప్పటి వరకూ చూశాం. కానీ ఓ మహిళ పెళ్లి పేరుతో ముసలాళ్లను బోల్తా కొట్టిస్తోంది. భార్యలు లేని ముసలి పురుషులకే ఆమె టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుని వదిలేస్తుంది. ఇలా 11 సంవత్సరాల్లో 8 పెళ్లిళ్లు చేసుకుంది ఈ నిత్యపెళ్లికూతురు. కానీ మోసం ఎంతో కాలం సాగదుగా బైటపడింది అమ్మగారి బండారం..



భార్య లేని ముసలాళ్ళే ఆమె టార్గెట్..అలా అందరూ కాదండోయ్ వారికి నిండుగా డబ్బుండాలి. డబ్బుంటే చాలు వెంటనే ఆ ముసలాళ్లతో చక్కగా మూడు ముళ్లు వేయించుకుంటుంది. కొత్త పెళ్లాం..పైగా పడుచు పెళ్లాం మోజులో పడ్డ ఆ ముసలాళ్లకు కొత్త లోకం చూపిస్తుంది. ఒగలు వలికిస్తుంది. బాగా నమ్మిస్తుంది. తరువాత కొంతకాలానికి అందినకాడికి..డబ్బులు..బంగారం వెండీ..విలువైన వస్తువులు అన్నీ సర్దేసుకుని ఉడాయిస్తుంది. అది ఆ నిత్యపెళ్లికూతురి యవ్వారం.



https://10tv.in/madhya-pradesh-11-years-old-boy-pet-rat-dead-5th-class-girl-killd/
దేశ రాజధాని ఢిల్లీలో ఈ నిత్య పెళ్లి కూతురు భాగోతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన మోనికా అనే 40 ఏళ్ల మహిళ 11 ఏళ్లలో ఎనిమిది మందిని పెళ్లి చేసుకొని భారీ నగదు..నగలతో ఉడాయించింది. మ్యాట్రిమోని సైట్ ద్వారా ఈ యవ్వారం అంతా నడిపి..పాపం పండి చివరకు దొరికిపోయింది. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నిత్యపెళ్లి కూతురు లీలు తెలిసి షాక్ అయ్యారు.


ఇటీవల ఢిల్లీకి చెందిన కాంట్రాక్టర్ జుగల్ కిషోర్ (66) భార్య ఏడాది క్రితం చనిపోయింది. దీంతో అతడు మరో పెళ్లికోసం ప్రయత్నాలు చేయగా తనకంటే 25 ఏళ్ల చిన్నదైన మోనిక అతన్ని వివాహం చేసుకుంది. రెండు నెలల తర్వాత రాత్రి సమయంలో నగలు, రూ. 45 లక్షల డబ్బు నగలతో ఉడాయించింది. దీంతో జుగల్ కిషోర్ పోలీసులను ఆశ్రయించాడు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు జుగల్ కిషోర్ ఇంటి పరిసరాల్లోని సీసీ టీవీ పరిశీలించగా ఓ బ్యాగుతో మోనికా ఇంటినుంచి వెళ్లిపోవటానికి గుర్తించారు. తరువాత ఆమె కోసం గాలించగా పోలీసులు చిక్కింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా..పోలీసులే ఆశ్చర్యపోయే నిజాల్ని చెప్పింది. అలా ఆమె ఒక్క జుగల్ కిషోర్ నే కాదు గత 11 ఏళ్లలో ఎనిమిదిమంది ముసలివారిని పెళ్లి చేసుకుని వారి నుంచి డబ్బులు..నగలు పట్టుకుని ఉడాయిస్తోందని తెలసుకున్నారు.