తమ్ముడు శ్రవణ్ మారుతీరావును చాలాసార్లు కొట్టాడు అందుకే ఆత్మహత్య : అమృత

  • Published By: veegamteam ,Published On : March 9, 2020 / 09:15 AM IST
తమ్ముడు శ్రవణ్ మారుతీరావును చాలాసార్లు కొట్టాడు అందుకే ఆత్మహత్య : అమృత

రాష్ట్రంలో సంచలనం కలిగించిన మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. ఆత్మహత్య తరువాత తండ్రి భౌతకి  కాయాన్ని చూసి వచ్చిన తరువాత అమత మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. 

తన వివాహం తరువాత జరిగిన పరిణామాలతో నా భర్తను చంపిన నా తండ్రి మారుతీరావు తన సొంత తమ్ముడి విషయంలో దగా పడి ఉండవచ్చనీ..తాను బైటకు వచ్చేసిన తరువాత ఆస్తులు పంచుకున్న మారుతీరావు. అతని తమ్ముడు శ్రవణ్ ల మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయనీ..తమ్ముడు మారుతీరావును రెండు మూడు సార్లు కొట్టాడని ఆ విషయం తన దృష్టికి వచ్చిందని అమత వర్షిని సంచలన విషయాలను వెల్లడించింది. 

తమ్ముడు శ్రవణ్ కు మారుతీరావు భయపడి కొంతకాలంపాటు రహస్యంగా ఎక్కడో దాక్కున్నారని కూడా నాకు తెలిసింది. ఈ విషయంలో మిర్యాలగూడలో అందరికీ తెలుసని తాను ఎంతగానో నమ్మిన తమ్ముడి తనపై చేయి చేసుకోవటం..ఇంటా బైటా జరుగుతున్న విషయాలతో ఆత్మహత్యకు పాల్పడేలా చేసి ఉండవచ్చని అమృత అభిప్రాయపడింది.అప్పటి వరకు అన్నమాటను ఎదిరించని శ్రవణ్ ఆస్తుల విషయానికి వచ్చేసరికి అన్నను ఎదిరించాడు. ఇదంతా ఆస్తుల కోసమే. నా అనుకున్నవారి దగా..మరోపక్క  కేసుల విషయం..కేసు క్రిటికల్ గా మారుతుండటంతో తీవ్ర ఒత్తిడికి గురైన అంత గట్టి మనిషిని ఆత్మహత్య చేసుకునేలా చేసి ఉండవచ్చని..అంతే తప్ప ఒక మనిషిని చంపటానికి కిరాయి మనుషుల్ని అందునా కన్నకూతురు భర్తనే చంపించటానికి కిరాయి మనుష్యులు పెట్టించిన మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అమృత తెలిపింది.

కన్నకూతురు జీవితాన్ని పాడుచేశానే అనే పశ్చాత్తాపం మారుతీరావులో ఏకోశానా కనిపించలేదనీ..అదే తన బంధువులు చేసిన మోసం..తమ్ముడు ఆస్తుల కోసం అన్ననే కొట్టటం వంటి విషయంలతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తెలిపింది అమృత.