ఐఏఎస్ అధికారుల భేటీ : రాజకీయ పార్టీల విమర్శలపై చర్చ

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 03:56 PM IST
ఐఏఎస్ అధికారుల భేటీ : రాజకీయ పార్టీల విమర్శలపై చర్చ

అమరావతిలో ఐఏఎస్ అధికారుల సమావేశం కొనసాగుతోంది. ఐఏఎస్ ల మీద రాజకీయ పార్టీల విమర్శలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఐఏఎస్ ల సమావేశానికి జవహర్ రెడ్డి, ప్రసాద్, ప్రవీణ్ కుమార్, ప్రసన్న, వెంకటేష్, ఉషాకుమారి హాజరయ్యారు.

సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలపై ఖండన ఇవ్వాలని ఐఏఎస్ ల అసోసియేషన్ నిర్ణయించింది. పది మంది ఐఏఎస్ లు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. వారి విజ్ఞప్తి మేరకు సమావేశం అయ్యారు. అయితే 9 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, కొంతమంది ట్రెయినర్స్ వచ్చారు. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ కౌంటర్ ఇవ్వాలి అనే అంశంపై చర్చిస్తున్నారు. ఆశించిన స్థాయిలో ఐఏఎస్ లు సమావేశానికి హాజరు కాలేదు. చాలా మంది ఐఏఎస్ లు సమావేవానికి రాలేమని చెప్పారు.