పెద్దిరెడ్డీ..30 రాజధానులు మీ సొంత డబ్బులతో కడతారా?

  • Published By: veegamteam ,Published On : December 20, 2019 / 07:06 AM IST
పెద్దిరెడ్డీ..30 రాజధానులు మీ సొంత డబ్బులతో కడతారా?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగారూ..ఏపీలో మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామని మీ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు..30 రాజధానులు కట్టటానికి  మీ సొంత సొమ్ములున్నాయా..అని టీడీపీ నేత శ్రావణ్ కుమార్ ఎద్దేవా చేశారు. రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్ని తిరిగి ఇచ్చేస్తాం..ఏపీలో మూడు రాజధానులు కాదు 30 రాజధానులు కడతామంటూ  మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.

ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలే కాదు అమరావతి ప్రాంతంలోని గ్రామాల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చదువుకున్నాడు..మంత్రి పదవిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల్ని మరింత గందరగోళానికి గురి చేస్తాయని జ్నానం లేకుండా మంత్రి మాట్లాడటం ఎంత వరకూ సమంజసం అంటూ శ్రావణ్కుమార్ ప్రశ్నించారు. పెద్దిరెడ్డికి బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? లేక పిచ్చెక్కి మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. మీ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరనీ…ఆయన ఇచ్చేస్తే భూముల్ని తీసుకోవటానికి రైతులు సిద్ధంగా లేరని అన్నారు.  

కర్నూలు…విశాఖపట్నంలో మరో రెండు రాజధానులు కడతామంటున్న వైసీపీ ప్రభుత్వం అక్కడి రైతులతో కూడా ఇలాగే మాట్లాడతారా? రాజధానికి భూములిచ్చిన రైతుల్ని పిచ్చివాళ్లనుకుంటున్నారా? ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే పడటానికి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.