ఆడపిల్లలను రేప్ చేసి చంపినప్పుడు NHRC ఎందుకు స్పందించదు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) దర్యాఫ్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. దిశ కేసులో

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 12:04 PM IST
ఆడపిల్లలను రేప్ చేసి చంపినప్పుడు NHRC ఎందుకు స్పందించదు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) దర్యాఫ్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. దిశ కేసులో

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) దర్యాఫ్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. దిశ కేసులో ఎన్ హెచ్ ఆర్ సీ రాకపై రోజా అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు అన్యాయం జరిగినప్పుడు కనిపించని ఎన్ హెచ్ ఆర్ సీ ఇప్పుడు వచ్చి హడావుడి చేయడం ఏంటని విమర్శించారు. అభంశుభం తెలియని చిన్న పిల్లలను, యువతులను, మహిళలను రేప్ చేసి చంపేస్తే ఎన్ హెచ్ ఆర్ సీ పట్టించుకోవడం లేదని రోజా అన్నారు.

దిశ లాంటి అమ్మాయిని రేప్ చేసి కాల్చి చంపితే కూడా పట్టించుకోలేదని వాపోయారు. అలాంటి మానవ హక్కుల కమిషన్.. నేరస్తులను ఎన్ కౌంటర్ చేస్తే ఎందుకు తల్లడిల్లిపోతున్నారు అని అడిగారు. నేరస్తులకు మాత్రమే మానవ హక్కులు ఉంటాయా? ఆడపిల్లలకు ఉండవా? అని నిలదీశారు. ఈ విషయంలో ఎన్ హెచ్ ఆర్ సీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రోజా చెప్పారు.

* NHRCపై ఎమ్మెల్యే రోజా అసంతృప్తి
* దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై NHRC జోక్యం సరికాదు
* అమాయక యువతులను అత్యాచారం చేసి చంపినప్పుడు
మానవ హక్కుల కమిషన్ ఏమైంది
* క్రూరమైన నేరస్తులను ఎన్ కౌంటర్ చేస్తే NHRC ఎందుకు తల్లడిల్లుతోంది
* నిందితులను వెనకేసుకొస్తే NHRC మీద ప్రజలకు గౌరవం పోతుంది