పోలీస్ స్టేషన్ పై నుంచి దూకి టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
పోలీసుల వేధింపులకు తట్టుకోలేక శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఎస్.ఎమ్ పురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఛైర్మన్ చౌదరి దనలక్ష్మీ కుమారుడు అవినాశ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసు స్టేషన్ రెండవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తన తండ్రి చౌదరి బాబ్జీపై తనపై వైసీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఈ చర్యకు పాల్పడ్డాడు.
ఎడ్చెర్ల పోలీస్ స్టేషన్ రెండవ అంతస్తు పైనుంచి దూకగా.. అవినాశ్కు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. ఈ రకమైన చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చౌదరి అవినాశ్, చౌదరి బాబ్జీపై పోలీసులు మూడు కేసులు పెట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. కేసులు విచారణ జరుగుతుందని, వేధించలేదని డీఎస్పీ అంటున్నారు.
అయితే ప్రతి గొడవకు అవినాశ్ని భాద్యున్ని చేస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేధిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఎస్సై రాజేష్ తనను వేధిస్తున్నారంటూ అవినాష్ తీవ్ర మనస్థాపం చెందాడని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో ఎస్ఎంపురం సర్పంచ్గా కూడా అవినాష్ పనిచేశాడు. పోలీసులు తీరుపై జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
See Also | ఏపీలో IPSలకు పదోన్నతులు, బదిలీలు : అదనపు డీజీగా ఆర్కే మీనా