సూర్యాపేటలో దారుణం : ఆస్తి కోసం..తల్లిని, చెల్లిని చంపేసిన కొడుకు

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 05:16 AM IST
సూర్యాపేటలో దారుణం : ఆస్తి కోసం..తల్లిని, చెల్లిని చంపేసిన కొడుకు

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’నని ఓ మహానుభావుడు అన్న మాట కొన్ని ఘటనలద్వారా అక్షరాలు నిజమవుతున్నాయి. ఆస్తుల కోసం కన్నవారిని కట్టుకున్నవారిని కూడా కడతేర్చేస్తున్న ఘటనలో జరుగుతునేఉన్నాయి. ఈ క్రమంలో అటువంటి ఘటన సూర్యాపేట మండలం తాళ్ల కాంపాడ్‌లో జరిగింది. ఆస్థి కోసం చెల్లిని, తల్లిని అత్యత దారుణంగా కడతేర్చాడు ఓ కొడుకు. 

ఆస్తి కోసం చెల్లిని, సవతి తల్లిని అత్యంత దారుణంగా కొడుకు హతమార్చాడు హరీశ్ అనే యువకుడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.  చెల్లెలు మౌనిక(22), పిన తల్లి కప్పల అంజమ్మ(45)ను కొడుకు కప్పల మహేష్ హత్య చేశాడు. మహేష్ తండ్రి నాగయ్యకు ఇద్దరు భార్యలు కాగా..ఆస్తి తనకు రాదనే అనుమాననంతో చెల్లిపైనా పినతల్లిపైన క్షక్ష పెంచుకున్న హరీశ్ ఈ హత్యలు చేసినట్టుగా తెలుస్తోంది. రెండు హత్యలు చేసిన తరువాత భయపడిన హరీశ్ పరారయ్యాడు. 

ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడు హరీశ్ కోసం గాలిస్తున్నారు.