గ్రామంలో గన్ కల్చర్: సిద్ధిపేట..అక్కన్నపేటలో AK 47 కాల్పుల కలకలం..! 

  • Published By: veegamteam ,Published On : February 7, 2020 / 04:37 AM IST
గ్రామంలో గన్ కల్చర్: సిద్ధిపేట..అక్కన్నపేటలో AK 47 కాల్పుల కలకలం..! 

సిద్ధిపేట జిల్లా అక్కన్న పేటలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. గంగరాజు అనే వ్యక్తిపై సందానందం అనే వ్యక్తి ఏకే 47తో కాల్పులు జరిపాడు. హఠాత్తుగా తుపాకీతో గంగరాజు జరిపిన కాల్పుల నుంచి సందానం తృటిలో తప్పించుకున్నాడు. దీంతో తుపాకీ పట్టుకుని గంగరాజు పరారయ్యాడు. కాల్పుల సౌండ్ వినిపించేసరికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలీక అల్లాడిపోయారు.
  
కాగా గంగరాజుకు..సదానందానికి ఇటీవల సరిహద్దు ప్రహరీగోడ విషయంలో వివాదం జరిగింది. అదికాస్తా ఇరుకుటుంబాల మధ్యా ఘర్షణలకు దారి తీసింది. ఈ క్రమంలో గంగరాజుపై సదానందం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై గంగరాజు..అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిసరాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని..సదానందం కుటుంబ సబ్యులకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సదానందం కోసం గాలిస్తున్నారు. 

అసలు సదానందానికి ఏకే 47 తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? సరిహద్దు విషయంలో జరిగిన చిన్న వివాదానికే కాల్పులు జరిపాడా? లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో సదానందం కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. 

వివారాల్లోకి వెళితే..రోజులాగేనే శుక్రావరం (ఫిబ్రవరి 7,2020)న తెలతెలవారుతోంది. గ్రామస్థులు తెల్లవారుఝామునే లేచారు. ఎవరి పనులువ వారు చేసుకుంటున్నారు.ఇంతలో ఢాం అంటూ పెద్ద శబ్ధం విని గ్రామస్థులు హడలిపోయారు. ఏంజరిగిందో తెలీయక భయాందోళనలకు గురయ్యారు.

ఏం జరిగిందాని శబ్ధం వినిపించినవైపుగా పరుగులు తీశారు. గత కొంతకాలంగా గుంతి గంగరాజుకు సదానందానికి సరిహద్దు గోడ విషయంలో జరుగుతున్న వివాదంతో గంగరాజుపై ఆగ్రహానికి గురైన సదానందం హఠాత్తుగా తన ఇంటిలోకిం  గంగరాజుపై  ఏకే 47 తీసుకొచ్చి గంజరాపుపై  రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అదృష్టం కొద్దీ గంగరాజు తప్పించుకోవాటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై బాధిత సదానందం పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సదానందం కోసం గాలిస్తున్నారు. 

దర్యాప్తులో భాగంగా పోలీసులు సదానందం కుటుంబ సభ్యులకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాడు.గొర్రెలను కాచుకుంటూ జీవనం సాగించే సదానందానికి  ఏకే 47 ఎలా వచ్చింది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  కాగా ప్రశాంతంగా ఉండే గ్రామంలో  ఏకే 47 కాల్పులు పెను సంచలనం సృష్టించాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అక్కన్నపేటలో భారీగా మోహరించారు. బృందాలుగా విడిపోయి సదానందం కోసం తీవ్రంగా గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.