టీఆర్ఎస్ లోకి భారీ వలసలు : ఫ్లోరోసిస్ శాశ్వతంగా తరిమేస్తాం

  • Published By: veegamteam ,Published On : January 7, 2019 / 10:55 AM IST
టీఆర్ఎస్ లోకి భారీ వలసలు : ఫ్లోరోసిస్ శాశ్వతంగా తరిమేస్తాం

హైదరాబాద్: త్వరలోనే మిషన్ భగీరథ పూర్తి కాబోతోందనీ..ఫ్లోరోసిస్ శాశ్వతంగా తరిమికొడతామని టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్న క్రమంలో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ, టీ.వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు జనవరి 7న సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. జెడ్పీటీసీ కందుల సంధ్యారాణితో సహా పలువురు జిల్లా నేతలు టీఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు..త్వరలోనే మిషన్ భగీరథ పూర్తి కాబోతోందనీ..ప్రతీ ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామని నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ భూతాన్ని రూపుమాపి శాశ్వతంగా తరిమికొడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీ భారీ విజయం సామాన్య విజయం కాదనీ..ఓటుతోనే కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్యపై టీఆర్ఎస్‌ పోరాడితే అప్పుడు మంత్రులుగా ఉన్న ఉత్తమ్, జానారెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. తండాల్లో చైతన్యం వచ్చింది కాబట్టే.. జానారెడ్డిని నిలదీశారన్నారు. 3,400 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేన‌ని కేటీఆర్ తెలిపారు.