చదివిన స్కూల్లోనే ఓటు వేశా హ్యాపీగా ఉంది : ప్రకాశ్రాజ్
బెంగళూరు సెంట్రల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ప్రకాశ్రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..బెంగళూరు సెంట్రల్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాననీ..తాను ఎక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నటుడు, లోక్సభ ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రకాశ్రాజ్ అన్నారు. ఓటు వేయడం అందరి బాధ్యత అన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయిన ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.
సామాన్య ప్రజల వల్లెనే పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ప్రకాశ్ రాజ్ క్యూలో నిలుచుని ఓటేశారు. బెంగుళూరు సెంట్రల్ నుంచి ఇండిపెడెంట్ గా ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా వ్యాప్తంగా 95 లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాళ రెండవ దశ పోలింగ్ కొనసాగుతోంది. కర్నాటక మంత్రి హెచ్డీ రేవన్నా.. హసన్ నియోజకవర్గంలో ఓటేశారు.
Bengaluru: Independent candidate from Bengaluru Central, Prakash Raj queues up at a polling booth, to cast his vote in #LokSabhaElections2019 pic.twitter.com/y93wPMKpxC
— ANI (@ANI) April 18, 2019