యాదాద్రి భువనగరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో రేవ్పార్టీ..తెల్లవారుజాము వరకు మద్యంమత్తులో ఎంజాయ్
యాదాద్రి భువనగరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో రేవ్పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రేవ్ పార్టీ జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. రాచకొండ ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు.
rave party in Samsthan Narayanapuram : యాదాద్రి భువనగరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో రేవ్పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రేవ్ పార్టీ జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. రాచకొండ ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. సుమారు 90 మంది ఈ రేవ్పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. పోలీసులను చూసి 10 మంది పరారయ్యారు. మిగతావారంతా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అరెస్ట్ అయినవారిలో యువకులు, యువతులు ఉన్నారు.
టీఆర్ఎస్ నేతకు చెందిన ఓ ఫాం హౌస్లో ఈ రేవ్ పార్టీ జరిగింది. జక్కిడి ధన్వంతరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో రైతు కుమారుడు …ఈ రేవ్ పార్టీని ఏర్పాటుచేశాడు. తెల్లవారుజామువరకు మద్యం మత్తులో యువతీయువకులు ఎంజాయ్ చేశారు. మద్యం సేవిస్తూ, నిషేధిత డ్రగ్స్ తీసుకుంటూ, బిర్యానీలు తింటూ కాలక్షేపం చేయడమే కాదు..యువతీయువకులు సరససల్లాపాల్లో మునిగితేలారు.
ఘటనాస్థలంలో మద్యం బాటిళ్లతో పాటు, నిషేధిత డ్రగ్స్ను, వంట సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు చెందిన 60 బైక్లు, 14 కార్లను సీజ్ చేశారు. వాటిని సంస్థాన్ నారాయణపురం పోలీస్స్టేషన్కు తరలించారు.
గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్లలో రేవ్ పార్టీలు ఎక్కువగా జరుగుతుండేవి. వీకెండ్ వస్తే చాలు… రేవ్ పార్టీల బాట పట్టేవారు జల్సారాయుళ్లు. అయితే పోలీసు నిఘా ఎక్కువవడంతో ఇప్పుడు జిల్లాల్లోని మండల కేంద్రాలు, మారుమూల గ్రామాల్లోనూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. రేవ్ పార్టీ కల్చర్ సంస్థాన్ నారాయణపురానికి పాకడంతో స్థానికంగా కలకలం రేగింది.