Tenth Exams : తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు..ఇంటర్ వాయిదా
పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించింది.
Tenth exams canceled in Telangana : పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇంటర్, ఎస్ఎస్సీ బోర్డ్ అధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గతేడాదిలాగే ఈసారి కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. స్కూల్స్, కాలేజీల్లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని విద్యా సంస్థలను మూసివేశారు.
స్పెషల్ సీఎస్ ఛాంబర్లో విద్యాశాఖ మీటింగ్ ఏర్పాటు చేసినా.. అధికారులు ఉన్నపళంగా మీటింగ్ స్పాట్ను చేంజ్ చేశారు. సీక్రెట్ ప్లేస్లో స్పెషల్ సీఎస్, ఇంటర్, ఎస్ఎస్సీ బోర్డు అధికారులు సమావేశమయ్యారు.