Covid-19 : కరోనా వచ్చిందని గొంతు కోసుకున్న వృద్ధుడు
Covid-19 : కరోనా పాజిటివ్ వచ్చిందనే భయంతో ఒక వృద్ధుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కృష్ణాజిల్లా నందిగామ మండలం కంచికచర్ల లోని రంగానగర్ లో నివసించే జొన్నలగడ్డ నారాయణ అనే వ్యక్తికి కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగోలేదు.
దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అందులో కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఆందోళన చెందిన నారాయణ గొంతు కోసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని వెంటనే నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గతంలో నారాయణ కంచికచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ లో 30 ఏళ్లపాటు క్లర్క్గా పనిచేసి రిటైరయ్యారు.