గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్ – ఫస్ట్ లుక్

ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్' ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : August 29, 2019 / 07:12 AM IST
గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్ – ఫస్ట్ లుక్

ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

స్వర్గీయ శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్, బాలీవుడ్‌లో ధడఖ్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తూ, డైరెక్ట్ చేస్తున్న భారీ హిస్టారికల్ మూవీ తఖ్త్‌లో.. కరీనా కపూర్, రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్, భూమి ఫడ్నేకర్, విక్కీ కౌశల్ తదితరులతో కలిసి నటిస్తుంది. అలాగే గుంజన్ సక్సేనా బయోపిక్‌లోనూ జాన్వీ నటిస్తుంది.

ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ తెరకెక్కుతుంది.. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టీషర్ట్ వేసుకుని పేపర్ రాకెట్‌తో ఆడుకుంటున్నట్టుగా ఉన్న పోస్టర్‌కు ‘అమ్మాయిలు పైలెట్‌లు అవ్వలేరు’ అనే కామెంట్ పెట్టారు. జాన్వీని తోటి పైలట్‌లు అభినందిస్తున్న మరో పోస్టర్‌కు ‘యుద్ధానికి వెళ్లిన భారతదేశపు మొట్టమొదటి మహిళా ఎయిర్‌ఫోర్స్ అధికారిణి’ అంటూ కామెంట్ పెట్టారు.

Read Also : డిసెంబర్ 20న డిస్కోరాజా..

భారత మొదటి మహిళా పైలెట్‌గా పేరొందిన గుంజన్.. 1999 కార్గిల్ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆమె ధైర్యానికి మెచ్చి ప్రభుత్వం శౌర్యవీర్ అవార్డు కూడా అందించింది. గుంజన్ క్యారెక్టర్ లో నటించడానికి జాన్వీ పైలెట్‌గా ట్రైనింగ్ తీసుకుంది. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. శరణ్ శర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. 2020 మార్చి 13న ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ విడుదల కానుంది.