రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్
జాతీయ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ కోర్టు వారెంట్ను జారీ చేసింది.
తన భర్తకు 2014లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక మోసగించారని కళావతి బాయి అనే మహిళ ఖానాపురం హవేలీ పోలీస్స్టేషన్లో కంప్లెయింట్ చేశారు. దీంతో పోలీసులు రేణుకా చౌదరిపై సెక్షన్ 420, 417 కింద కేసు నమోదు చేశారు.ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం రేణుకకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను తీసుకోకపోవడం, విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది.