Bindu Madhavi : బిగ్బాస్ విన్నర్ బిందు మాధవి షో నుంచి ఎంత సంపాదించిందో తెలుసా??
ఈ సారి బిగ్బాస్ విజేతకు 50 లక్షలు ప్రకటించారు. అయితే ఫినాలేకి అఖిల్, అరియనా, బిందు మాధవిలు నిలిచారు. ఫినాలేలో ఇద్దర్నే ఉంచేందుకు ప్రైజ్మనీలోంచి....................
BiggBoss NonStop : ఇటీవలే తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ పూర్తి అయింది. ఓటీటీలో టెలికాస్ట్ అయిన ఈ బిగ్బాస్ సీజన్ లో బిందు మాధవి విన్నర్ గా గెలిచి తెలుగులో మొదటి మహిళా విన్నర్ గా నిలిచింది. బిగ్బాస్ షోలో పాల్గొన్న వారికి వారానికి ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. అది కాకుండా విన్ అయిన వాళ్లకి నగదు బహుమతి కూడా ఉంటుంది. షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ బయటకి వచ్చాక వాళ్ళ రెమ్యునరేషన్ వివరాలు ఆరా తీయడం మామూలే. మరి ఈ సారి బిగ్బాస్ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి ప్రైజ్మనీ ఎంత సాధించింది? రెమ్యునరేషన్ ఎంత తీసుకుంది అని చర్చిస్తున్నారు.
ఈ సారి బిగ్బాస్ విజేతకు 50 లక్షలు ప్రకటించారు. అయితే ఫినాలేకి అఖిల్, అరియనా, బిందు మాధవిలు నిలిచారు. ఫినాలేలో ఇద్దర్నే ఉంచేందుకు ప్రైజ్మనీలోంచి 10 లక్షలు ఆఫర్ చేశారు. దీంతో అరియనా గ్లోరీ ఆ 10 లక్షలు తీసుకొని ఫినాలే నుంచి తప్పుకోవడంతో ప్రైజ్మనీ 40 లక్షలుగా మిగిలింది. బిందు మాధవి విన్నర్గా నిలవడంతో ఈ 40 లక్షల ప్రైజ్మనీ గెలుచుకుంది.
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు
ఇక రెమ్యునరేషన్ పరంగా బిందు మాధవికి వారానికి దాదాపు 5 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. బిగ్బాస్ హౌస్ లో బిందు మొత్తం 12 వారాలు ఉంది. దీంతో రెమ్యునరేషన్ దాదాపు 60 లక్షలు వరకు సంపాదించింది. ప్రైజ్మనీతో కలిపి కోటి రూపాయల వరకు సంపాదించింది బిందు. కానీ ట్యాక్సులు పోగా చేతికి 70 లక్షల వరకు వస్తాయి. మరి విన్నర్ గా నిలిచిన బిందు ఇప్పటికే ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ముందు ముందు ఇంకెన్ని సినిమాల్లో ఛాన్స్ కొడుతుందో చూడాలి.