india vs west indies: సూర్య అద్భుతమైన షాట్లు ఆడాడు: హార్దిక్ పాండ్యా
సూర్యకుమార్ చాలా శ్రమ పడ్డాడని, వీలైనంత బాగా ఆడే ప్రయత్నం చేశాడని తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని ఆటగాళ్ళందరికీ పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని హార్దిక్ పాండ్యా అన్నాడు.
india vs west indies: వెస్టిండీస్తో నిన్న జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన షాట్లు ఆడాడని టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. నిన్నటి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ 76 పరుగులు చేశాడు. దీనిపై హార్దిక్ పాండ్యా స్పందిస్తూ… సూర్యకుమార్ చాలా శ్రమ పడ్డాడని, వీలైనంత బాగా ఆడే ప్రయత్నం చేశాడని తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోని ఆటగాళ్ళందరికీ పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని హార్దిక్ పాండ్యా అన్నాడు.
ఫలితాన్ని గురించి చింతించబోడని చెప్పాడు. మరోవైపు, కొత్త అంశాలపై రోహిత్ దృష్టి పెడతాడని, పొరపాట్ల నుంచి నేర్చుకుంటాడని తెలిపాడు. తాను బౌలింగ్ను బాగా ఎంజాయ్ చేస్తున్నానని పాండ్యా చెప్పాడు. తన వల్ల జట్టులో నిలకడ ఉంటుందని తెలిపాడు. దీంతో కెప్టెన్కు విశ్వాసం పెరుగుతుందని తెలిపాడు. జీవితంలో సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తే సానుకూల ఫలితాలే వస్తాయని చెప్పాడు. కాగా, ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో టీమిండియా రెండు గెలిచి ఒకటి ఓడిపోయింది. నాలుగో మ్యాచ్ శనివారం జరగాల్సి ఉంది.
China: అమెరికా, తైవాన్పై ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా.. కీలక చర్యలు