టీటీడీలో ఉద్యోగాల పేరుతో మోసం..60 మంది నుంచి లక్షల్లో వసూలు
టీటీడీలో ఉద్యోగాల పేరుతో బెజవాడలో రాందేవ్ అనే వ్యక్తి నిరుద్యోగుల్ని మోసం చేశాడు. టీటీడీ లడ్డూ కౌంటర్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు టోకరా వేశాడు. 60 మంది నుంచి లక్షల్లో వసూలు చేశాడు.
నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకుని రాందేవ్ సైలెంట్ అయ్యాడు. అయితే బాధితులు ఉద్యోగాల గురించి అడిగితే బెదిరించాడు. దీంతో ఆగ్రహించిన బాధితులు… రాందేవ్ను పట్టుకుని విజయవాడ టూటౌన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.