Artificial Intelligence : కృత్రిమ మేధస్సుతో మానవాళికి ముప్పు!
ఏఐ దుష్ర్పభావాలపై యూఎస్ కు చెందిన యేల్ యూనివర్సిటీ సర్వే నిర్వహించింది. వాల్ మార్ట్, జూమ్, కోకాకోలా, మీడియా, ఫార్మాస్యూటికల్ సహా ప్రపంచంలోనే టాప్ కంపెనీలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
![Artificial Intelligence : కృత్రిమ మేధస్సుతో మానవాళికి ముప్పు! Artificial Intelligence : కృత్రిమ మేధస్సుతో మానవాళికి ముప్పు!](https://10tv.in/wp-content/uploads/2023/06/Artificial-Intelligence-1.jpg)
Artificial Intelligence
Threat To Humanity : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పెను సంచలనాన్ని సృష్టింస్తోంది. కృత్రిమ మేధస్సుతో ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ఏఐతో భవిష్యత్ లో మానవాళికే ముప్పు వాటిల్లనుందని ప్రపంచంలోనే టాప్ కంపెనీల సీఈవోలు అభిప్రాయపడుతున్నారు.
ఏఐ దుష్ర్పభావాలపై యూఎస్ కు చెందిన యేల్ యూనివర్సిటీ సర్వే నిర్వహించింది. వాల్ మార్ట్, జూమ్, కోకాకోలా, మీడియా, ఫార్మాస్యూటికల్ సహా ప్రపంచంలోనే టాప్ కంపెనీలకు చెందిన 119 మంది సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.
Andhra Pradesh : బంధువు అంత్యక్రియలకు వెళ్లి ముగ్గురు మృతి.. పాడె మోస్తుండగా విద్యుత్ షాక్
వీటిలో 42 శాతం మంది రానున్న 5 నుంచి 10 ఏళ్లలో ఏఐతో మానవత్వానికి ముప్పు వాటిల్లుతుందని
ఆందోళన వ్యక్తం చేశారు. 34 శాతం మంది మరో పదేళ్లలో కృత్రిమ మేధస్సుతో మానవాళికి ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. 8 శాతం మంది ఐదేళ్లలోనే ఏఐ దుష్ర్పభావాలు ఉంటాయని అంటున్నారు.