YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల ఫోకస్.. నేటి నుంచి జిల్లాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తండ్రి బాటలో పయణించేందుకు ఆమె సిద్ధమయ్యారు.

YS Sharmila : ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై షర్మిల ఫోకస్.. నేటి నుంచి జిల్లాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే

YS Sharmila

YS Sharmila AP Tour : ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తండ్రి బాటలో పయణించేందుకు ఆమె సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసేందుకు నిర్ణయించారు. ఇవాళ (23వ తేదీ) నుంచి ఈనెల 31వ తేదీ వరకు జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభం కానుంది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం నుంచి మొదలుకానున్న షర్మిల పర్యటన ఇడుపులపాయ వరకు సాగుతుంది.

Also Read : Botsa Satyanarayana : అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం.. సమ్మె విరమణ.. నేటి నుంచి విధుల్లోకి

షర్మిల పర్యటన షెడ్యూల్ ఇలా..
ఇవాళ (మంగళవారం) ఉదయం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వై.ఎస్. షర్మిల పర్యటిస్తారు. మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురంలో పర్యటించి పార్టీ పరిస్థితిపై షర్మిల సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి విజయనగరంలో పర్యటించి.. ఆ జిల్లాపై షర్మిల సమీక్ష చేయనున్నారు. రోజు మూడు నుంచి నాలుగు జిల్లాల చొప్పున పర్యటిస్తూ జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై షర్మిల సమీక్షలు నిర్వహించనున్నారు.

ఈనెల 24న విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాలపల్లిలో షర్మిల పర్యటన కొనసాగనుంది.
25న కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాల్లో..
26న ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ..
27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో..
28న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో..
29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ..
30న శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో..
ఈనెల 31న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగనుంది. అదేరోజు ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది.