KTR: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్: కేటీఆర్

బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి సంస్థలకు..

KTR: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్: కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్ రావచ్చని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జైల్లో సౌకర్యాలు ఏమి లేవని, కవిత 11 కిలోల బరువు తగ్గారని తెలిపారు. 12 వేల మంది ఉండాల్సిన జైల్లో 30 వేల మంది ఉన్నారని చెప్పారు.
ఢిల్లీలో ఇప్పటికే తాము న్యాయవాదులను కలిశామని కేటీఆర్ అన్నారు.

బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి సంస్థలకు లీగల్ నోటీసులు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో హైదరాబాద్‌కు తీరని నష్టం వాటిల్లిందని కేటీఆర్ అన్నారు. 2001లో చంద్రబాబు ప్రభుత్వం తొలిదశ పనులు మొదలు పెట్టిందని, హైదరాబాద్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు మొదలు పెట్టిందని తెలిపారు.

దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో నీటి కోసం పోరాటం జరుగుతుందని, హైదరాబాద్‌లో మాత్రం కేసీఆర్ ముందు చూపుతో ఆ పరిస్థితి లేదని కేటీఆర్ చెప్పారు. ఈ వేసవి నాటికి హైదరాబాద్‌కు అక్కడి నుంచి నీటి తరలించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనా వేసిందని అన్నారు. వేసవిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచిందని తెలిపారు.

శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సుంకిశాల ఘటన జరిగిందని కేటీఆర్ చెప్పారు. 2వ తేదీన టన జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? తెలిసి దాచిపెట్టారా? అని అన్నారు. గతంలో మేడిగడ్డ విషయాన్ని తాము రహస్యంగా ఉంచలేదని, ప్రమాదం జరిగిన గంటల్లోనే నిర్మాణ సంస్థ స్పందించిందని తెలిపారు.

Also Read: మరోసారి రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం.. మా నాన్న మాకు కావాలంటూ కుమార్తె ఆవేదన