చర్లపల్లిలో అగ్నిప్రమాదం: రూ. కోట్ల ఆస్తి నష్టం
హైదరాబాద్: వేసవికాలం వచ్చిందంటే చాలు అగ్నిప్రమాదాలు భయపెడుతుంటాయి. వేసవి ఇంకా పూర్తిగా రానేలేదు అప్పుడద నగరంలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. (ఫిబ్రవరి 24) అర్థరాత్రి చర్లపల్లి ఫేస్ త్రీ ఇండస్ట్రీ ఎస్ఈఆర్ ఎంటర్ ప్రైజెస్లో ఈ ప్రమాదం సంభవించింది. స్థానికులు అగ్నిప్రమాద సిబ్బందికి..కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాదంలో రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు గుర్తించారు.