Minister Kodali Nani : ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారు : మంత్రి కొడాలి నాని

చంద్రబాబు, లోకేశ్ పేర్లు చెబితే నాలుగు ఓట్లు కూడా రాలవని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామనే మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని పేర్కొన్నారు.

Minister Kodali Nani : ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారు : మంత్రి కొడాలి నాని

Kodali Nani

AP Minister Kodali Nani : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి మరీ పార్టీని లాక్కున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన ఘటన చంద్రబాబుది అని విమర్శించారు. ఇవన్నీ చేసిన మిమ్మల్ని ఏమనాలి అని అన్నారు. మీరు.. ఎన్టీఆర్ ను మోసం చేసిన ద్రోహులేనని చెప్పారు. ఎన్టీఆర్ ఫొటో పెట్టుకునే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని చెప్పారు. ఎన్టీఆర్ పేరెత్తే అర్హత వీరికి లేదన్నారు. ఇప్పుడున్న టీడీపీ నేతలకు ఎన్టీఆర్ పై ప్రేమ లేదన్నారు. చంద్రబాబుకి ఎన్టీఆర్ పై ఎలాంటి ప్రేమ లేదని చెప్పారు. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఎందుకు వెన్నుపోటు పొడిచారని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ పార్టీ స్థాపించి నలబై ఏళ్ళు అయిందని ఆయన బొమ్మ పెట్టుకొని ప్రజలని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, చెప్పులతో కొట్టారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి చంద్రబాబు దించేశారు… ఆయన చావుకు కారణం అయ్యారని ఆరోపించారు. చంద్రబాబు బొమ్మ పెడితే ప్రజలు అసహ్యహించుకునే పరిస్థితి లో ప్రజలు ఉన్నారని తెలిపారు. లోకేష్, చంద్రబాబు పోటీలో పెడితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఒడిపోతుందన్నారు.

Kodali Nani : చంద్రబాబు ఇక ఎప్పటికీ సీఎం కాలేరు- కొడాలి నాని

చంద్రబాబు, లోకేశ్ పేర్లు చెబితే నాలుగు ఓట్లు కూడా రాలవని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామనే మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని పేర్కొన్నారు. లోకేశ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదన్నారు. ఎన్టీఆర్ పై అంతా ప్రేమ ఉంటే ఎందుకు వెన్నుపోటు పొడిచాడు… సీఎం కుర్చీ నుంచి ఎందుకు దించారని నిలదీశారు. ఎన్టీఆర్ గొప్ప వాడు అయితే మీరు 420 బ్యాచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గొప్పవాడు అనుకుంటే చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాల కాళ్ళు పట్టుకొవాలన్నారు.

తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిందని విమర్శించారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో పారిపొయ్యే స్థితికి చంద్రబాబు తెచ్చారని చెప్పారు. ఎన్టీఆర్ కి చేసిన ద్రోహానికి చంద్రబాబుకి శాపం తగిలిందన్నారు. లోకేష్ ఓడిపోవడానికి ఎన్టీఆర్ శాపం కారణం కాదా? అని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు, లోకేష్ ని సమాధి చేస్తారని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి లేకుంటే టీడీపీ నేతలు తన విశ్వరూపాన్ని చూస్తారని తెలిపారు. బాలకృష్ణ ఇప్పుడే నిద్ర లేచి ఉంటాడని తెలిపారు. భజన బృందంలో బాలకృష్ణ భాగస్వామ్యం అయ్యారని ఎద్దేవా చేశారు.