Visakha : స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యుల రాక..గేట్ల దిగ్భందానికి పిలుపు

స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యులు 2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం వైజాగ్‌లో పర్యటించనున్నారు. ప్లాంట్‌ను పరిశీలించి.. ఆస్తులను అంచనా వేయనుంది ఈ బృందం.

Visakha : స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యుల రాక..గేట్ల దిగ్భందానికి పిలుపు

Vizag Steel

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కేంద్రం మరో ముందడుగు వేస్తోంది. స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యులు 2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం వైజాగ్‌లో పర్యటించనున్నారు. ప్లాంట్‌ను పరిశీలించి.. ఆస్తులను అంచనా వేయనుంది ఈ బృందం. మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శుక్రవారం స్టీల్ ప్లాంట్ అన్ని గేట్ల దిగ్బందానికి పిలుపునిచ్చింది. స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యుల రాకను నిరసిస్తూ పరిశ్రమ అన్ని గేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ సీహెచ్ నరసింగరావు వెల్లడించారు.

Read More : Naralokesh : ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం…2024లో టీడీపీ విజయం ఖాయం

ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ వాల్యుయేషన్, అడ్వైజర్ కమిటీలను రానివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైజాగ్ ఉక్కు కర్మాగారం అడ్మిన్ భవనం ముట్టడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు కార్మిక సంఘాల నేతలు.

Read More : Allu Sirish : సోషల్ మీడియాకి దూరం అవుతున్న అల్లు శిరీష్

10 నెలల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు ఉద్యమం చేసినా.. కేంద్రం తన నిర్ణయాన్ని విషయంలో వెనక్కు తగ్గకుండా అమ్మకానికి కాలు దువ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అన్ని కార్మిక సంఘాలు..రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి స్టీల్ ప్లాంట్​ను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ఆస్తుల వాల్యుయేషన్ కమిటీ సభ్యుల రాక, ఉద్యోగుల ఆందోళనతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి.