Govt Liquor Shop : ప్రభుత్వ మద్యం షాపులో నగదు మాయం..సేల్స్ మెన్లు, సూపర్ వైజర్లు బదిలీలు

ఏపీలో మద్యం షాపులన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గత కొంతకాలం క్రితం గవర్నమెంట్ నిర్వహించే మద్యం షాపుల్లో నగదు మాయం అవ్వటం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో సేల్స్ మెన్ల నుంచి సూపర్ వైజర్లను ఆకస్మిక బదిలీలు చేశారు.

Govt Liquor Shop : ప్రభుత్వ మద్యం షాపులో నగదు మాయం..సేల్స్ మెన్లు, సూపర్ వైజర్లు బదిలీలు

Govt Liquor Shop

Cash missing In AP Government Liquor Shop: ఏపీలో మద్యం షాపులన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గత కొంతకాలం క్రితం గవర్నమెంట్ నిర్వహించే మద్యం షాపుల్లో నగదు మాయం అవ్వటం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో జిల్లాలోని 266 ప్రభుత్వ మద్యం షాపుల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.

విశాఖ జిల్లాలోని సర్కిల్-4లో ఉన్న నాలుగు షాపులు మినహా..అన్ని షాపులు సవ్యంగానే ఉన్నాయని తెలిపారు.అలాగే నగరంలోని అన్ని ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే సేల్స్ మెన్ల నుంచి సూపర్ వైజర్లను ఆకస్మిక బదిలీలు చేసింది ప్రభుత్వం. సర్కిల్ -4 మద్యం షాపుల నుంచి నగదు పక్క దారి పట్టిందనే కారణంగా సేల్స్ మెన్ల నుంచి సూపర్ వైజర్లను ఆకస్మిక బదిలీలు చేశారు. కాగా..విశాఖలోని సర్కిల్-4 పరిధిలో నాలుగు షాపుల్లో 33లక్షలు మాయం చేసిన విషయం తెలిసిందే. బదిలీలు చేసిన ఉత్తర్వులు నేటి నుంచి అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.