CM Jagan: వకులమాత ఆలయానికి సీఎం జగన్.. పలు కార్యక్రమాల శంకుస్థాపన

సీఎం వైయస్ జగన్ గురువారం (నేడు) తిరుపతిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో వకుల మాత ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చి.. ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

CM Jagan: వకులమాత ఆలయానికి సీఎం జగన్.. పలు కార్యక్రమాల శంకుస్థాపన

Ap Cm Jagan

CM Jagan: సీఎం వైయస్ జగన్ గురువారం (నేడు) తిరుపతిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో వకుల మాత ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చి.. ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

తిరుపతి సమీపంలోని పాత కాలవ గ్రామం పేరూరు బండపై వెలసిన వకుళ మాత ఆలయం వెలిసింది. హైదర్ అలీ దండయాత్రలో ఆలయం ధ్వంసం కావడంతో వందల ఏళ్లుగా శిధిలావస్థలో ఉండిపోయింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టి పునర్మిర్మాణం పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంతో పాటు రూ.3644 కోట్ల రూపాయలతో ఎనిమిది పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం వైఎస్ జగన్.

Read Also: ఈనెల 28న విదేశాలకు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు గ్రామంలో అపాచీ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంకు హాజరు కానున్నారు. సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో 700 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుకానున్న అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకనున్నాయి.

ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో 1230 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న టీసీఎల్ కంపెనీ భూమి పూజ కార్యక్రమానికి సీఎం జగన్ విచ్చేయనున్నారు. 125 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి దొరకుతుంది.

రేణిగుంట విమానాశ్రయం సమీపంలో మరో ఆరు పరిశ్రమల ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం.