Jagan slams chandrababu: చంద్రబాబు నాయుడు కలియుగ కబ్జాదారుడు, రావణుడు: సీఎం జగన్

జగన్‌ మాట్లాడుతూ.. ప్రజలు మోసగాళ్ల మాటలను నమ్మద్దని కోరారు. సొంతంగా పార్టీ పెట్టుకుని ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, జగన్‌ అధికారంలోకి వచ్చారని చెప్పారు. అయితే, తెలుగు దేశం పార్టీని కబ్జా చేసిన చంద్రబాబుని ఓ కబ్జాదారుడు అంటారని విమర్శించారు. సొంత పార్టీ స్థాపించి అధికారంలోకి వస్తే రాముడు అంటారని, మామ పార్టీని లాగి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని రావణుడు అంటారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబుకు 2024లో 'బాయ్ బాయ్' చెప్పాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, ప్రజలకు మంచి జరిగిందని భావిస్తే తనకు మద్దతివ్వాలని జగన్ అన్నారు.

Jagan slams chandrababu: చంద్రబాబు నాయుడు కలియుగ కబ్జాదారుడు, రావణుడు: సీఎం జగన్

Jagan slams chandra babu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలియుగ కబ్జాదారుడు, రావణుడు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాజకీయమంటే ఒక జవాబుదారీతనమని, మోసం చేసే చంద్రబాబుకి ప్రజలు గుడ్ బై చెప్పాలని కోరారు. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ప్రజలు మోసగాళ్ల మాటలను నమ్మద్దని కోరారు. సొంతంగా పార్టీ పెట్టుకుని ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌, జగన్‌ అధికారంలోకి వచ్చారని చెప్పారు. అయితే, తెలుగు దేశం పార్టీని కబ్జా చేసిన చంద్రబాబుని ఓ కబ్జాదారుడు అంటారని విమర్శించారు. సొంత పార్టీ స్థాపించి అధికారంలోకి వస్తే రాముడు అంటారని, మామ పార్టీని లాగి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని రావణుడు అంటారని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. అలాంటి చంద్రబాబుకు 2024లో ‘బాయ్ బాయ్’ చెప్పాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, ప్రజలకు మంచి జరిగిందని భావిస్తే తనకు మద్దతివ్వాలని జగన్ అన్నారు.

‘‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నాం. 17వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నాం. రెండేళ్ల కొంద గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించాం. తొలిదశలో రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందించాం. ఫిబ్రవరిలో రెండో దశలో 4వేల గ్రామాల్లో సర్వే. మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు ఇస్తాం. ఆగస్ట్‌, 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతుంది’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

నరసాపురం లో రెండు లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్డు విస్తరణకు మంత్రి ధర్మాన కోరిక మేరకు సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తునట్టు ప్రకటించారు. ఉద్దానం కిడ్నీ రోగులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడించారు. వంశధార ప్రాజెక్టు అడ్డంకులు అధిగమిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఒడిశా సీఎంతో మాట్లాడినట్లు తెలిపారు.

‘‘10,185 గ్రామ సర్వేయర్లు, 3,664 వార్డు ప్లానింగ్ సెక్రటరీల, రూ. 1000 కోట్ల వ్యయం, 4,500 సర్వే బృందాలు, ఎయిర్ క్రాఫ్టులు, హెలికాప్టర్లు, డ్రోన్లు, 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2,000 రోవర్ల ద్వారా అత్యాధునిక సాంకేతికలతో రీసర్వే చేయబడుతుంది. ప్రతి భూకమతాన్ని సర్వే చేసి అత్యంత కచ్చితత్వంతో అక్షాంశ, రేఖాంశాలు, గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు QR కోడ్ తో కూడిన భూ కమత పటం భూ యజమానులకు జారీ చేస్తాం. ప్రతి స్థిరాస్తికీ ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత పత్రం ఇస్తాం’’ అని జగన్ చెప్పారు.

‘‘జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల సంఖ్య కేవలం 295, మండల సర్వేయర్ల సంఖ్య కేవలం 676.. సర్వే, మ్యూటేషన్, ఇతరత్రా రిజిస్ట్రేషన్ సేవల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి, లంచాలు, వివక్ష. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో భూ రికార్డులన్నీ క్రోడీకరించి తయారు చేసిన (భూ కమతాలతో కూడిన గ్రామ పటం), ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటు లోకి తెచ్చింది.

టాంపరింగ్ కు ఏమాత్రం అవకాశం లేకుండా డిజిటల్ పద్ధతిలో భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే భద్రం చేయబడుతుంది. ఇకపై గ్రామా సర్వేయర్ల ద్వారా 15 రోజుల్లో ఫీల్డ్ లైన్ దరఖాస్తు జరగనుంది అలనే 30 రోజుల్లో పట్టా సుబ డివిజన్ దరఖాస్తుల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపై శాశ్వత భూహక్కు, భూరక్ష కింద అందించే భూ సంబంధిత సేవలన్నీ గ్రామ సచివాలయాల్లో సింగిల్ డెస్క్ ద్వారా అందజేస్తాం’’ అని జగన్ అన్నారు.

సీఎం జగన్ ని తీసుకుంటున్న చర్యలను సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్వీ సింగ్ ప్రశంసించారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పల్రాజు తదితర స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..