Kapu Reservation: కాపు రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిలో భాగంగా కేంద్రం గతంలో 10 శాతం రిజర్వేషన్లపై ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

Kapu Reservation: కాపు రిజర్వేషన్లపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Kapu Reservation: ఆంధ్ర ప్రదేశ్‌లో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ విషయంలో కౌంటర్ దాఖలు చేయలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో కాపు రిజర్వేషన్ల అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ అనుచరుల్ని విడుదల చేయండి.. పంజాబ్ పోలీసులకు సిక్కు సంస్థ అల్టిమేటం

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిలో భాగంగా కేంద్రం గతంలో 10 శాతం రిజర్వేషన్లపై ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

గతంలో కేసు విచారణ సుప్రీంకోర్టులో ఉన్నందువల్ల రిజర్వేషన్లు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పిందని, అయితే, ఇప్పుడు కేసు విచారణ ముగిసినప్పటికీ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రాధాకృష్ణ కోర్టుకు తెలిపారు. కాగా, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కేసు విచారణను కోర్టు వచ్చే నెల 26కు వాయిదా వేసింది.