డబ్బులిచ్చి..చెప్పులు, రాళ్లు వేయించుకుంటున్నారు – మంత్రి పేర్ని నాని

  • Published By: madhu ,Published On : November 28, 2019 / 11:17 AM IST
డబ్బులిచ్చి..చెప్పులు, రాళ్లు వేయించుకుంటున్నారు – మంత్రి పేర్ని నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి పేర్ని నాని. ఇప్పటికీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డబ్బులిచ్చి..చెప్పులు, రాళ్లు వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏ మొహం పెట్టకుని..కేంద్రానికి ఫిర్యాదు చేస్తారని బాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం అమరావతిలో బాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నానితో 10tv మాట్లాడింది. 

రాజకీయ లబ్ది కోసం..తన కొడుకు భవిష్యత్ కోసం..ప్రీ ప్లాన్డ్‌గా సృష్టించుకున్నదని విమర్శించారు. ఆయనే పూలు కొనుక్కొంటాడు..మనుషులను పోగేసుకుంటాడు..ఆయనే చెప్పులు వేయించుకుంటాడని ఇదంతా బాబు కృత్రిమసృష్టి అంటూ ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ కల్పన కోసం ఉద్రిక్తతలు, గొడవలు చేశారన్నారు. దిక్కుతోచని పరిస్థితిల్లో బాబు ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. భూమి అప్పచెప్పిన వారికి కనీసం ప్లాట్లు వేసించారా ? అని సూటిగా ప్రశ్నించారు. మోసం, దుర్మార్గం, వంచన అన్నారు.

ఆరు మాసాల క్రితం జనం సొమ్ముతో మీటింగ్‌లు పెట్టి..కేంద్రాన్ని..తిట్లు తిట్టిన బాబు..ఏ రకంగా ఢిల్లీకి వెళుతారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఘనమైన రాజధాని కడుతానని చెప్పి మొండిగోడలతో నాలుగు బిల్డింగ్‌‌లు కట్టారన్నారు. బాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తత నడుమ సాగింది. పలు చోట్ల నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. సీడ్ యాక్స్ రోడ్డు వెంట..నిరసన బ్యానర్లు కట్టారు. రాయపూడి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. గొడవలు జరుగకుండా..జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
Read More : అమరావతి టూర్ : పోరాటం నా కోసం కాదు..ప్రజల కోసం – బాబు