Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ముహూర్తం ఖరారు

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర ద్వారా నారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది.

Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ముహూర్తం ఖరారు

Nara Bhuvaneshwari (1)

Nara Bhuvaneshwari Bus Yatra : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఏపీలో బస్సు యాత్రకు సిద్ధం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేయనున్నారు. నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర చేయాలని నారా భువనేశ్వరి భావిస్తున్నారు. కుప్పం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రాయలసీమ జిల్లాల్లో 10 రోజుల బస్సు యాత్రకు టీడీపీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.

చంద్రబాబు జైల్లో ఉండటం, లోకేష్ ఢిల్లీకే పరిమితం కావడంతో టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రంగంలోకి దిగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ బస్సు యాత్రకు మేలుకో ఆంధ్రుడా అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ యాత్ర పది రోజులపాటు జరిపేలా ప్లాన్ చేస్తున్నారు.

Chandrababu Arrest: టీడీపీ ఆధ్వర్యంలో ‘సత్యమేవ జయతే’ దీక్షలు.. ఎవరెవరు ఎక్కడ దీక్షలో పాల్గొంటున్నారంటే..

అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర చేయాని భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర ద్వారా నారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభమై ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో సాగనుందని తెలుస్తోంది.

చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు బహిరంగంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని భువనేశ్వరి ఈ యాత్రతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సోమవారం గాంధీ జయంతి సందర్భంగా నారా భువనేశ్వరి దీక్ష చేపట్టనున్నారు. రాజమండ్రిలో నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

Kottu Satyanarayana : అమరావతి భూ కుంభకోణంలో పవన్ కల్యాణ్‌కి కూడా వాటా ఉంది- మంత్రి కొట్టు సంచలన ఆరోపణలు

ఢిల్లీలో లోకేష్, రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు దీక్షలు చేయనున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొన్నారు. భువనేశ్వరితోపాటు ఆమె కోడలు బ్రాహ్మణి కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్లొంటున్నారు.