Pawan Kalyan : రణస్థలంలో పవన్‌ యుద్ధభేరి.. వైసీపీ సర్కార్‌పై ‘పవర్’ పంచ్‌లు, టీడీపీతో పొత్తుపై క్లారిటీ

రణస్థలంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై యుద్ధభేరి మోగించారు. పవర్ పంచ్ లతో జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. జాగ్రత్త అంటూ.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వారాహితో వస్తున్నా.. ఆపేదెవరో చూస్తా అంటూ సమర శంఖం పూరించారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan : రణస్థలంలో పవన్‌ యుద్ధభేరి.. వైసీపీ సర్కార్‌పై ‘పవర్’ పంచ్‌లు, టీడీపీతో పొత్తుపై క్లారిటీ

Pawan Kalyan : రణస్థలంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై యుద్ధభేరి మోగించారు. పవర్ పంచ్ లతో జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. జాగ్రత్త అంటూ.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వారాహితో వస్తున్నా.. ఆపేదెవరో చూస్తా అంటూ సమర శంఖం పూరించారు పవన్ కల్యాణ్.

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. రాష్ట్ర భవిష్యత్ కోసం వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వబోమన్నారు. సింగిల్ గానే పోటీ చేస్తే తనకు అండగా ఉంటానని హామీగా ఉంటే పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు పవన్.

శ్రీకాకుళం రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు. డైరెక్ట్ గా వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. ఇదే వేదికలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.

‘దశాబ్దం పాటు పోరాడాను. నాకు బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానైనా వెళ్తా. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు ఇస్తారా? ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదు. నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలి. వచ్చే ఎన్నికల్లో ఓటు చీలకూడదు. గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే వెళ్తాం. కుదరకపోతే ఒంటరిగానైనా వెళ్తాం’ అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.

గెలుస్తానో, ఉంటానో, ఓడిపోతానో నాకు తెలియదన్న పవన్.. తనకు తెలిసిందల్లా పోరాడడం ఒక్కటేనని అన్నారు. గూండా గాళ్లను తిరిగి ఎలా తన్నాలో, వెధవలను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. భాష, కులం, గోత్రం, మతం, ప్రాంతం ఇవన్నీ మనం కోరుకున్నవి కావని, వీటన్నింటిని దాటుకుని గుర్రం జాషువా ప్రవచించిన విశ్వనరుడి వైపు పయనించడమే ప్రతి మనిషి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.

”గత ఎన్నికల్లో నా సభలకు జనం తరలివచ్చారు.. కానీ ఓట్లేసే సమయానికి నన్ను వదిలేశారు. చట్టసభల్లో ఎదిరించి నిలబడేందుకు అవసరమైన సత్తా ఇవ్వలేకపోయారు. రెండు చోట్ల ఓడిపోయావు అని కించపరుస్తూ ఉంటే దాన్ని యుద్ధం తాలూకు గాయంగానే భావించాను. అంతేతప్ప, నేనేం బాధపడలేదు.. అవమానంగా భావించలేదు.

ఆశయం ఉన్నవాడికి ముందడుగే ఉంటుందని నమ్మేవాడిని. ఈ రణస్థలంలో మాట ఇస్తున్నా.. తుదిశ్వాస విడిచే వరకు రాజకీయాలను వదిలివెళ్లను, ప్రజల వెన్నంటే ఉంటాను. దీన్ని నా మూడో తీర్మానంగా తీసుకోండి” అని పవన్ అన్నారు.