Pawan kalyan ‘Janavani’: పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ నినాదాలు.. ఉద్రిక్తత

 వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖలో ‘జనవాణి’ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘పోర్టు కళావాణి ఆడిటోరియం’ వద్ద లిఖిత పూర్వకంగా వినతి పత్రాలు స్వీకరించాలని జనసేన భావించింది. దీంతో వైసీపీ కార్యకర్తలు ‘పోర్టు కళావాణి ఆడిటోరియం’ పరిసర ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు.

Pawan kalyan ‘Janavani’: పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ నినాదాలు.. ఉద్రిక్తత

Pawan kalyan ‘Janavani’: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖలో ‘జనవాణి’ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘పోర్టు కళావాణి ఆడిటోరియం’ వద్ద లిఖిత పూర్వకంగా వినతి పత్రాలు స్వీకరించాలని జనసేన భావించింది. దీంతో వైసీపీ కార్యకర్తలు ‘పోర్టు కళావాణి ఆడిటోరియం’ పరిసర ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు.

పవన్ కల్యాణ్ గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని జనసేన కరా్యకర్తలు డిమాండ్ చేస్తుండడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు, నోవాటెల్ హోటల్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జనసేన నేతలతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు.

జనవాణి కార్యక్రమానికి ఎలా వెళ్తున్నారు? ఏ మార్గంలో వెళ్తారు? వంటి విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, ఇప్పటివరకు విజయవాడ, భీమవరం, తిరుపతిలో జనసేన ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహించింది. ఇప్పుడు విశాఖలో తొలిసారి నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు వినతులను స్వీకరించాలని జనసేన భావించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..