Ram Mohan Naidu: యువతను నిలబెట్టి గెలుస్తాం.. అధికారంలోకి వస్తాం -రామ్మోహన్ నాయుడు

రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కొడాలి నానియని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు.

Ram Mohan Naidu: యువతను నిలబెట్టి గెలుస్తాం.. అధికారంలోకి వస్తాం -రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu

Ram Mohan Naidu: రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కొడాలి నానియని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు. గుడివాడ టీడీపీ కార్యలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తుందని విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో అప్పులబారం ఎక్కువయ్యిందని, అధిక పన్నులు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని, అక్రమ సంపాదనే లక్ష్యంగా లిక్కర్ మాఫియా పనిచేస్తుందని, నిత్యావసర వస్తువుల ధరలు అమ్మి, జగన్ మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు.

నవరత్నాలు, బూడిద రత్నాలయ్యాయని, సన్నబియ్యం, నాణ్యమైన బియ్యం ప్రజలకు ఇస్తామని చెప్పిన మంత్రి ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చి 22మంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడిగట్లేదని, రైల్వేజోన్ కావాలి అని మోడీని నిలదీయలేకపోతున్నారని రామ్మోహన్ నాయడు విమర్శించారు.

అమరావతి రాజధాని కాదు అంటూ మూడు ముక్కలాట ఆడుతూ.. రైతుల ప్రాణాలతో సీఎం ఆటలాడుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తంచేశారు. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు యువతకు ఎన్నికల్లో అవకాశం ఇచ్చి గెలిపించుకుని టీడీపీని అధికారంలోకి తీసుకుని వస్తామని చెప్పారు రామ్మోహన్ నాయుడు.

ఉత్తరాంధ్రలో రూ.2800కోట్ల భూములు తాకట్లు పెట్టి అప్పు తీసుకున్నారని, మద్యంపై ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి ఎర్రన్నాయుడు విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా గుడివాడలో ఏర్పాటు చేసినందుకు ఆనందం వ్యక్తం చేసిన రామ్మోహన్ నాయుడు.. గుడివాడ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.