Sajjala : ఆధారాలు లేకుండా ఆరోపణలు కరెక్ట్ కాదు-సజ్జల

చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. చంద్రబాబు కుట్రల స్వభావం ఉన్న వ్యక్తి. ఎన్టీఆర్ మృతికి పరోక్షంగా కారణమైన వ్యక్తి చంద్రబాబు..

Sajjala : ఆధారాలు లేకుండా ఆరోపణలు కరెక్ట్ కాదు-సజ్జల

Sajjala

Sajjala : ఏపీలో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాడుతోంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. వైఎస్ వివేకా హత్య వ్యవహారంలో చంద్రబాబు వ్యాఖ్యలను సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. రాజకీయ నేతలు చేసే ఆరోపణలకు ఆధారాలు ఉండాలని హితవు పలికారు.

YS Viveka : వైఎస్ వివేకా హత్య కేసు.. మళ్లీ మొదలైన సీబీఐ విచారణ

గుండెపోటు అన్నంత మాత్రాన అది దర్యాప్తును ప్రభావితం చేసినట్టు అవుతుందా? అని సజ్జల ప్రశ్నించారు. కనిపించే సాక్ష్యాధారాలను దర్యాప్తు అధికారులు పరిశీలనలోకి తీసుకుంటారని చెప్పారు. సాక్ష్యాధారాలను ఎవరు తారుమారు చేస్తారని సజ్జల ప్రశ్నించారు. బహుశా సీబీఐ కంటే చంద్రబాబు మెరుగైన దర్యాప్తు చేస్తారేమో అని ఎద్దేవా చేశారు.

Sajjala : వివేకా హత్య కేసు.. సీబీఐ ఛార్జిషీట్‌లో కుట్ర ఉంది-సజ్జల సంచలనం

ఎదుటివారిపై సెటైర్లు వేసే క్రమంలో చంద్రబాబు తానే అపహాస్యం పాలవుతున్నారని సజ్జల విమర్శించారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు కుట్రల స్వభావం ఉన్న వ్యక్తి అని సజ్జల ఆరోపించారు. ఎన్టీఆర్ మృతికి పరోక్షంగా కారణమైన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వైఎస్ఆర్ మృతిపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయని సజ్జల అన్నారు. వైఎస్ వివేకా లేకపోవడం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ అన్నారు. సీఎం జగన్ పెద్ద అండను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు సజ్జల.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే రెండు మూడు దఫాలుగా విచారించిన సీబీఐ.. కేసు విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణలో వేగాన్ని పెంచేందుకు సీబీఐ సిద్ధమైంది.

వివేకా హత్య కేసులో ఇప్పటికే రెండు చార్జీషీట్లను కోర్టులో దాఖలు చేసిన సీబీఐ.. ఐదుగురిని నిందితులుగా చేర్చింది. అలాగే ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందని ప్రస్తావించిన తరుణంలో త్వరలో అరెస్టు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వివేకా డ్రైవర్ దస్తగిరి వేసిన అప్రూవర్ పిటిషన్ హైకోర్టు సమర్ధించిన నేపథ్యంలో కేసులో అతడు ఇచ్చిన వాంగ్మూలం మరింత కీలకం కానుంది. ఇప్పటికే ఈ కేసులో ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు ప్రధాన నిందితులుగా ఉండగా.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిపైనా ఆరోపణలు వినిపించాయి. ఆయన పేరును సీబీఐ ఛార్జిషీట్ లో చేర్చినట్లు ప్రచారం కూడా జరిగింది.

ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హస్తముందని.. ఆయన వెనుక సీఎం జగన్ ఉన్నారంటూ టీడీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఇదే ఉందని.. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని అంటున్నారు. రాజకీయ కక్షతోనే వివేకాను చంపేశారని చెబుతున్నారు. కాగా, ఓ ల్యాండ్ సెటిల్మెంట్ కి సంబంధించిన డబ్బు విషయంలో వివాదం కారణంగా వివేకాను చంపేశారని వార్తలు వచ్చాయి.