Anitha: నాని నోరు విప్పాడు.. మిగిలినవారూ ప్రశ్నించాలి -అనిత
తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నానీకి థ్యాంక్స్ చెప్పారు.
Anitha: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ హీరో నాని చేసిన కామెంట్లు హాట్టాపిక్గా మారగా.. ఇదే విషయమై తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నానీకి థ్యాంక్స్ చెప్పారు. టిక్కెట్ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని అన్నారు.
రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదని అన్నారు అనిత. ఈ ప్రభుత్వ విధానాలతో మాకు సంబంధం లేదనుకున్నారో.. భయపడ్డారో కానీ సినిమా వాళ్లు స్పందించట్లేదని అన్నారు. సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు సెగ తాకిందని, ఇప్పటికైనా హీరో నానీ వంటి వారు స్పందించినందుకు థ్యాంక్స్ చెప్పారు అనిత.
ఇంకా పెద్దహీరోలు కూడా ఈ విషయంలో స్పందించాలని, పెట్రోల్ ధరలను తగ్గించరు.. నిత్యావసరాల వస్తువుల ధరలను తగ్గించరు.. కానీ ఈ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను మాత్రం రాజకీయం చేస్తుందని అన్నారు. సినిమా టిక్కెట్ ధరలు తగ్గించి ప్రజలను ఉద్దరించినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని అన్నారు.
మద్యం ధరలు తగ్గించి పాలాభిషేకాలు చేయించుకునే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని కూడా అన్నారు. హీరో నానితో పాటు.. మిగిలిన వారు కూడా సినీ ఇండస్ట్రీ సమస్యల మీదే కాకుండా ఇతర సమస్యలపై స్పందించాలని, సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారని అన్నారు. వైసీపీ నేతలు హీరో నాని తల్లి గురించి మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు అనిత.