Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు.

Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Chittoor Road Accident

Chittoor Road Accident :  చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. మృతులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారీగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మేడమర్తి, విజయనగరం జిల్లా పూసపాటిరేగకు ఎనిమిది మంది కారులో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు.

చదవండి : Road Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

కాణిపాకం దర్శనం పూర్తి చేసుకొని ఆదివారం సాయంత్రం 3 గంటలకు తిరుమలకు బయలుదేరారు. ఇదే సమయంలో చంద్రగిరి సమీపంలోని ఐతేపల్లి మలుపు వద్ద ఆటోను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొంది.. ప్రమాద సమయంలో కారు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లుగా సమాచారం.. డివైడర్ ను ఢీకొన్న కారు వందమీటర్లు ఫల్టీలు కొడుతూ వెళ్లి కల్వర్టును ఢీకొని ఆగిపోయింది. డివైడర్‌ను ఢీకొన్న సమయంలో కారులోంచి ఫ్యూయల్ లీక్ అయింది.

చదవండి : Road Accident : రోడ్డు ప్రమాదం-ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

కల్వర్టును ఢీకొన్న తర్వాత మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం మెరైన్‌ ఇంజనీర్‌ కంచా రపు సురేష్‌కుమార్‌ (40), అతని భార్య మీనా (33), వీరి చిన్న కుమార్తె జోష్మిక నందిత (6 నెలలు), సురేష్‌కుమార్‌ తండ్రి శ్రీరామమూర్తి (65), తల్లి సత్యవతి (55), మామ పైడి గోవిందరావు, అత్త హైమావతి మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి జోషిత గాయాలపాలై మృత్యువును జేయించింది. ప్రమాదంలో అందరిని కోల్పోయి అనాథగా మిగిలింది జోషిత. కాగా మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం అనంతరం స్వస్థలాలకు తరలించారు.