Ruia RMO Suspended : తిరుపతి రుయా ఘటన.. ఆర్ఎంవో సస్పెండ్, ఆ నలుగురిపై క్రిమినల్ కేసులు

తిరుపతి రుయా ఘటనపై 10టీవీ కథనాలతో ఏపీ సర్కార్ యాక్షన్ మొదలు పెట్టింది. అంబులెన్స్ మాఫియా ఘటనలో రుయా ఆర్ఎంవో పై వేటు పడింది.

Ruia RMO Suspended : తిరుపతి రుయా ఘటన.. ఆర్ఎంవో సస్పెండ్, ఆ నలుగురిపై క్రిమినల్ కేసులు

Ruia Rmo Suspended (1)

Ruia RMO Suspended : చిత్తూరు జిల్లా తిరుపతి రుయా ఘటనపై 10టీవీ కథనాలతో ఏపీ సర్కార్ యాక్షన్ మొదలు పెట్టింది. అంబులెన్స్ మాఫియా ఘటనలో రుయా ఆర్ఎంవో పై వేటు పడింది. రుయా ఆర్ఎంవోను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

అటు అంబులెన్స్ ప్రీ-పెయిడ్ ట్యాక్సీ ధరల నిర్ణయానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్టీవో, డీఎంహెచ్ఓ, డీఎస్పీ ఉంటారు. ఇక రోగులు, బాధితుల నుంచి అధిక ధరలు వసూలు చేసిన నలుగురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు.(Ruia RMO Suspended)

Minister Vidadala Rajini: అంబులెన్సు మాఫియాను వదిలిపెట్టం: వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని

అసలేం జరిగిందంటే..
తిరుపతి రుయా ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరాయి. దందా చేస్తూ పేదలను పీడిస్తున్నాయి. అప్పటికే కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రికి అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మరింత కుమిలిపోయేలా చేశాయి. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రుయా అంబులెన్సు డ్రైవర్లు.. కేవలం 90 కిలోమీటర్ల దూరానికి రూ.20 వేలు అడిగి దౌర్జన్యం చేశారు. అంతేకాదు.. ఉచిత అంబులెన్సు వచ్చినా డ్రైవర్ ను బెదిరించి తన్ని తరిమేశారు.

దీంతో ఆ తండ్రి తన కన్నకొడుకు మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లాల్సి వచ్చింది. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జైశ్వ అనే చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురికాగా.. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిన్నాయి. పని చేయడం మానేశాయి. దీంతో నిన్న రాత్రి 11 గంటలకు బాలుడు కన్నుమూశాడు.

అయితే, కొడుకు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి బయట ఉన్న అంబులెన్సు డ్రైవర్లను అడిగాడు. అంబులెన్సు డ్రైవర్లు రూ.20 వేలు ఇస్తేనే వస్తామంటూ డిమాండ్ చేయడంతో తన వల్ల కాదని ఆ తండ్రి చేతులెత్తేశాడు. నిజానికి బాలుడి తండ్రి నర్సింహులు రోజువారి కూలీ. పొలం దగ్గర కాపాలా కాస్తూ జీవిస్తుంటాడు. ఈ నేపథ్యంలో రూ.20 వేలు తను భరించలేనని.. వారి కాళ్లవేళ్ల పడ్డాడు. అయినా వారు కనికరించలేదు. ఇక లాభం లేదనుకున్న నర్సింహులు.. గ్రామంలోని బంధువులకు ఇదే విషయాన్ని చెప్పడంతో.. వారు ఉచిత అంబులెన్సు సర్వీసును పంపారు.

Ruia Ambulance Mafia : రుయాలో అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు.. 90కి.మీ బైక్‌పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి

ఆసుపత్రికి వచ్చిన ఉచిత అంబులెన్స్ డ్రైవర్ ను రుయా ఆసుపత్రి వద్ద మాఫియాగా ఏర్పడిన అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకుని కొట్టారు. అక్కడి నుంచి తరిమేశారు. అంబులెన్స్ తీసుకుని లోపలికి వస్తే చంపేస్తామని డ్రైవర్ ను బెదిరించారు. తమ అంబులెన్సుల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అరాచకానికి తెరతీశారు. దీంతో ఆ తండ్రి చేసేదేమీ లేక తన బైక్ పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిపోయాడు. కాగా, ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని, అయినా అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.