YSR Nethanna Nestham : ప్రభుత్వం గుడ్‌న్యూస్, 10న వారి ఖాతాల్లోకి రూ.24వేలు

కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారులకు ఆర్థికసాయం అందిస్తున్నారు. తాజాగా మరో స్కీమ్ అమలు చేయనున్నారు. ఏపీలో చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించే ‘నేతన్న నేస్తం’ మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది.

YSR Nethanna Nestham : ప్రభుత్వం గుడ్‌న్యూస్, 10న వారి ఖాతాల్లోకి రూ.24వేలు

Ysr Nethanna Nestham

YSR Nethanna Nestham : కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సీఎం జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం లబ్దిదారులకు ఆర్థికసాయం అందిస్తున్నారు. తాజాగా మరో స్కీమ్ అమలు చేయనున్నారు. ఏపీలో చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించే ‘నేతన్న నేస్తం’ మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది.

ఈ నెల 10న ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న కార్మికులకు(ఒక్కొక్కరికి) రూ.24 వేలు ఇస్తారు. వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తారు. పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేసేందుకు శనివారం నుంచి మూడు రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజిస్టర్‌ అయి ఉన్నారా, లేదా అనే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది.

నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.