ఒక్కసారి రీ ఛార్జ్ చేస్తే…65 కిలోమీటర్ల ప్రయాణం..ధర రూ. 56, 999 మాత్రమే

  • Published By: madhu ,Published On : August 18, 2020 / 09:54 AM IST
ఒక్కసారి రీ ఛార్జ్ చేస్తే…65 కిలోమీటర్ల ప్రయాణం..ధర రూ. 56, 999 మాత్రమే

ఒక్కసారి రీ ఛార్జ్ చేస్తే…65 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. ఈ – ట్రాన్స్‌ ప్లస్‌ పేరుతో ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఐఐటీ హైదరాబాద్‌ స్టార్టప్‌ కంపెనీ ప్యూర్‌ ఈవీ (PURE EV) మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్, బ్లూ, మాట్‌ బ్లాక్‌–గ్రే కలర్‌ వేరియంట్లతో స్కూటర్ ఉంది. స్కూటర్‌ ప్రారంభ ఎక్స్‌–షోరూం ధర రూ. 56,999 గా కంపెనీ నిర్ణయించింది.



పోర్టబుల్‌ లిథియం బ్యాటరీలను ఇందులో ఏర్పాటు చేశారు. ఒక్కసారి రీ ఛార్జీ చేసుకుంటే..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. హై స్పీడ్ వేరియంట్ డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.



ప్యూర్‌ ఈవీ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ స్టార్టప్‌ ఇప్పటికే 4 ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసింది. దేశంలోని రోడ్లకు అనుగుణంగా స్కూటర్ ప్రయాణిస్తుందని ప్యూర్ ఎనర్జీ సీఈవో రోహిత్ వదేరా వెల్లడించారు. బ్యాటరీలు సైతం ఎక్కువగా మన్నుతాయని చెప్పారు.