US Woman: మాజీ భర్తపై పగ తీర్చుకోవడానికి ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి

బ్రూక్లిన్ ను తుపాకీతో ఓ రౌండ్ కాల్చింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. షారోన్ ను తుపాకీతో రెండు రౌండ్లు కాల్చింది. అయితే, షారోన్ గాయాలతోనే 911 ఎమర్జెన్సీ నంబరుకు ఫోను చేసి, తనను తన తల్లి కాల్చిందని చెప్పింది.

US Woman: మాజీ భర్తపై పగ తీర్చుకోవడానికి ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి

US Woman

US Woman: మాజీ భర్తపై పగ తీర్చుకోవడానికి తన ఇద్దరు కుమార్తెలను చంపిందో తల్లి. తాజాగా, ఆమెను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అమెరికాలో వెరోనికా యంగ్‌బ్లడ్ అనే 37 ఏళ్ల మహిళ తన కుమార్తెలు షారోన్ క్యాస్ట్రో (15), బ్రూక్లిన్ యంగ్‌బ్లడ్ (5)ను 2018 ఆగస్టులో చంపేసి, ఏమీ తెలియని అమాయకురాలిలా నటించింది. అనంతరం, ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

తనకు తీవ్ర మానసిక సమస్యలు ఉన్నాయని తనను నేరస్థురాలిగా చూడొద్దని వెరోనికా.. వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ కోర్టును కోరింది. అయితే, ఆమె అభ్యర్థనను న్యాయవాది అంగీకరించలేదు. విచారణ కొనసాగింది. చివరకు పోలీసులు వెరోనికాను దోషిగా నిరూపించేందుకు అన్ని ఆధారాలు సమర్పించారు. కోర్టులో వెరోనికా మాజీ భర్త, మాజీ బాయ్ ఫ్రెండ్, ఆమె సోదరి కూడా సాక్ష్యం చెప్పారు.

వెరోనికా తన కుమార్తెలను మత్తు పదార్థాలు ఇచ్చింది. అనంతరం బ్రూక్లిన్ ను తుపాకీతో ఓ రౌండ్ కాల్చింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. షారోన్ ను తుపాకీతో రెండు రౌండ్లు కాల్చింది. అయితే, షారోన్ గాయాలతోనే 911 ఎమర్జెన్సీ నంబరుకు ఫోను చేసి, తనను తన తల్లి కాల్చిందని చెప్పింది. షారోన్ ను ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించి చనిపోయింది. మాజీ భర్తపై పగ తీర్చుకోవడానికి వెరోనికా తన ఇద్దరు కుమార్తెలను చంపిందని తాజాగా తేలింది.

Lok Sabha elections-2024: ఎన్నికల ముందు రాజకీయాల్లోకి శిఖర్ ధావన్?