Delhi Crime: ఐపోన్-15 డెలివరీ లేట్ అయిందని మొబైల్ షాప్ వర్కర్లను చితకొట్టారు

ఢిల్లీలోని కమలా నగర్ లో ఉన్న ఒక మొబైల్ షాపులోకి వచ్చిన కస్టమర్లు.. ముందు అక్కడ పని చేస్తున్న వర్కర్లతో గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి వర్కర్లను విపరీతంగా కొట్టారు. ఒక వ్యక్తి చొక్కా తీసి మరీ కొట్టడం వీడియోలో చూడొచ్చు.

Delhi Crime: ఐపోన్-15 డెలివరీ లేట్ అయిందని మొబైల్ షాప్ వర్కర్లను చితకొట్టారు

iPhone 15: స్మార్ట్‭ఫోన్ ప్రపంచంలో యాపిల్ ఫోన్లకు ఉండే క్రేజ్ వేరు. యాపిల్ నుంచి కొత్త ఫోన్ వచ్చిందంటే.. మార్కెట్లో పోటీ ఓ రకంగా ఉంటుంది. అందరి కంటే ముందు తామే వాడాలనే ఆరాటం కూడా ఉంటుంది. అయితే ఈ క్రేజ్ తాజాగా దుష్పరిణామాలకు దారి తీసింది. ఐఫోన్-15 డెలివరీ ఆసల్యం అయిందంటూ ఒక మొబైల్ షాపులోని వర్కర్లను కొందరు కస్టమర్లు చితక్కొట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిందీ ఘటన. దాడికి సంబంధించిన దృశ్యాలు షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. నిందితుల్ని పట్టుకుని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీడియో ప్రకారం.. ఢిల్లీలోని కమలా నగర్ లో ఉన్న ఒక మొబైల్ షాపులోకి వచ్చిన కస్టమర్లు.. ముందు అక్కడ పని చేస్తున్న వర్కర్లతో గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి వర్కర్లను విపరీతంగా కొట్టారు. ఒక వ్యక్తి చొక్కా తీసి మరీ కొట్టడం వీడియోలో చూడొచ్చు.