Jharkhand Shocker: భార్యపై అనుమానం.. కోపంతో నాలుగేళ్ల కూతురుకు నిప్పంటించిన తండ్రి

భార్యపై వివాహేతర సంబంధం విషయంలో అనుమానంతో ఉన్న భర్త.. తన కోపాన్ని చిన్నారి కూతురుపై చూపించాడు. నాలుగేళ్ల కూతురుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Jharkhand Shocker: భార్యపై అనుమానం.. కోపంతో నాలుగేళ్ల కూతురుకు నిప్పంటించిన తండ్రి

Jharkhand Shocker: ఝార్ఖండ్‌లో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో, ఆమెపై గొడవపడ్డ ఒక వ్యక్తి నాలుగేళ్ల కూతురుకు నిప్పంటించాడు. ఈ ఘటన లోహర్ దగా జిల్లా, కిస్కో పోలీస్ స్టేషన్ పరిధిలోని కొచ్చా బర్నాగ్ గ్రామంలో గత శుక్రవారం రాత్రి జరిగింది.

Odisha Shocker: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త మర్మాంగం కోసి… ఆపై కత్తితో పొడిచి హత్య చేసిన భార్య

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజు తూరి-హీరా దేవి భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కూతురుంది. అయితే, సంజూ తూరి.. తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తున్నాడు. ఈ విషయంపై తరచూ భార్యాభర్తలు గొడవపడేవాళ్లు. గత శుక్రవారం కోపంతో ఇంటికొచ్చిన సంజు ఈ అంశంపై భార్యను నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్యా వాగ్వాదం జరిగింది. కోపంలో కత్తి తీసుకుని భార్యను చంపేందుకు ప్రయత్నించాడు. దీంతో భార్య ప్రతిఘటించింది. ఒక గదిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి, తలుపు వేసుకుంది.

కానీ, కూతురు అక్కడే ఉండిపోయింది. దీంతో నాలుగేళ్ల కూతురుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాలిక కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు వచ్చి బాలిక మంటలను ఆర్పేశారు. బాలిక తల్లి, మిగతావాళ్లు కలిసి చిన్నారిని రాంచీలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.