Odisha Shocker: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త మర్మాంగం కోసి… ఆపై కత్తితో పొడిచి హత్య చేసిన భార్య

భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం భర్త హత్యకు దారి తీసింది. ఒక మహిళ ఆవేశంతో తన భర్త ప్రాణాలే తీసింది. భర్త మర్మాంగాన్ని కోసి, ఆపై కత్తితో పొడిచి హత్య చేసింది.

Odisha Shocker: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త మర్మాంగం కోసి… ఆపై కత్తితో పొడిచి హత్య చేసిన భార్య

Odisha Shocker: ఒడిశాలో దారుణం జరిగింది. ఒక మహిళ… తన భర్త మర్మాంగాన్నికోసి, ఆపై కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన ఒడిశా, జాజ్‌పూర్ జిల్లా, పుబోలా ముందసాహి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు చంపియా అనే వ్యక్తికి, కుని చంపియా అనే మహిళతో కొంతకాలం క్రితం వివాహం జరిగింది.

Viral Video: షో రూం నుంచి అప్పుడే ఇంటికొచ్చిన కొత్త కారు.. ఎంత పని చేసింది? వీడియోలో రికార్డైన అనూహ్య ఘటన

రాజుకు ఇది రెండో వివాహం. కాగా, అతడు కుని ఇంటివద్దే ఇల్లరికం ఉంటున్నాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఇద్దరిమధ్యా గొడవ జరిగింది. ఆ తర్వాత భర్త రాజు నిద్రపోయాడు. కాస్సేపటికి భార్య పదునైన కత్తి తీసుకుని, భర్త మర్మాంగాన్ని కోసేసింది. తర్వాత అతడ్ని అదే కత్తితో పొడిచి హత్య చేసింది. భర్త మరణించిన తర్వాత అక్కడ్నుంచి పారిపోయింది. తర్వాత స్థానికుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక ప్రత్యేక బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు.