Thieves love story : ఇద్దరు దొంగల లవ్ స్టోరీ.. వీళ్ల స్కెచ్లు అంతకు మించి
ఇద్దరు దొంగల లవ్ స్టోరీ..సినిమా కథను తలపించేలా ఉంది.ప్రేమించకుని విలాసాలకు అలవాటుపడి.. పక్కా స్కెచ్లు వేస్తు ప్రేమ జంట దోపిడీలు నెక్ట్స్ లెవెల్..
Thieves love story : అవును వారిద్దరు ప్రేమించుకున్నారు.కలిసే దొంగతనాలు చేస్తారు. చక్కగా ఎంజాయ్ చేస్తారు. విలాసవంతమై జీవితానికి అలవాటుపడిన వారిద్దరు దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఆ డబ్బుతో చక్కగా ఎంజాయ్ చేస్తారు. దీని కోసం పక్కాగా స్కెచ్ వేస్తారు. ఎవ్వరికి అనుమానం రాకుండా సైలెంట్ గా దోచుకుపోతారు. అద్దెకున్న ఇంటినే దోచేస్తారు. ఆ పై పత్తాలేకుండా చెక్కేస్తారు. ఇది ఇద్దరు దొంగల లవ్ స్టోరీ. వీరి స్కెచ్ లు నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి. ఈ ఇద్దరు దొంగల లవ్ స్టోరీ విషయంలోకి వెళితే..
కర్ణాటక బెంగళూరులో గతకొంత కాలంగా జరుగుతున్న దొంగతనాల కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. అద్దెకు ఇల్లు కావాలని వస్తూ చోరీలు చేసే ప్రేమజంటను వినయ్, కీర్తనల పక్కా స్కెచ్ లను కనిపెట్టిన పోలీసులు ఇద్దరు దొంగల చోరీలను ఛేదించారు. వినయ్, కీర్తలకు మూడు సంవత్సరాల క్రితం పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకున్నారు. ఇద్దరం కలిస్తే దోచేయొచ్చని ప్లాన్ వేసుకుని దోపిడీలు ప్రారంభించారు.
వినయ్పై ఓ హత్య కేసుతో పాటు.. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడు. అతనిపై రౌడీషీట్ ఉంది. వినయ్ రౌడీషీటర్ అని తెలిసి కూడా కీర్తన అతన్ని ప్రేమిచింది. అతని కోసం ఏమైనా చేస్తాననే లెవల్ కు వెళ్లింది. దీంతో కీర్తన ప్రేమకు వినయ్ ఫిదా అయిపోయాడు. దీంతో ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని ఎక్కడంటే అక్కడకు తిరిగేవారు. అలా వినయ్-కీర్తనలు లవ్ ట్రాక్ బాగా పీక్స్ లోకి వెళ్లింది. తనను లాంగ్డ్రైవ్కు తీసుకెళ్లాలని, కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వాలని కీర్తన వినయ్ని ఒత్తిడి చేసేది. దీంతో ఇద్దరు కలిసి దొంగతనాలు చేసేవారు.
ఈ క్రమంలోనే అక్టోబర్ 4న మారుతీనగర్లోని ఓ ఇంటికి వెళ్లిన ఈ దొంగల జంట తాము ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి ఇల్లు అద్దెకు కావాలని నాటకం ఆడారు. అది నమ్మి ఓనర్ ఇల్లు అద్దెకు ఇచ్చాడు. ఆ తరువాత వారి ప్లాన్ ప్రకారం..పక్కా స్కెచ్ తో ఓ రోజు ఓనర్ ని ఏమార్చి ఒక మొబైల్ఫోన్, ల్యాప్టాప్, రూ.15 వేలు ఇలా అందిన కాడికి దోచుకుపోయారు. కానీ సీసీ టీవీల్లో రికార్డ్ అయి అడ్డంగా బుక్ అయిపోయారు.
Read more : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!
తమ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓనర్ ఇంటి అద్దెకోసం వచ్చిన జంట దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి.. చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమజంటను అదుపులోకి తీసుకున్నారు. అ తరువాత విచారణ జరుపగా వినయ్ లపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసే కీర్తన అతడిని ప్రేమించిందనీ..ఇప్పుడు ఇద్దరు దొరికిపోయారని కానీ కీర్తన మాత్రం వినయ్ అంటే నాకు ప్రాణం అతని కోసం ఏదైనా చేస్తాను..జైలుకు వెళ్లటానికి కూడా రెడీ అంటోందని తెలిపారు. ఈ కేసు దర్యాప్తును కొనసాగిస్తున్న పోలీసులు వీరు ఇంకా ఎక్కడెక్కడ చోరీలు చేశారో విచారిస్తున్నారు.