దారుణం : 5 ఏండ్ల గిరిజన బాలికపై అత్యాచారం

  • Published By: madhu ,Published On : June 28, 2020 / 07:43 PM IST
దారుణం : 5 ఏండ్ల గిరిజన బాలికపై అత్యాచారం

కరోనా వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే..ఓ వైపు దారుణాలు మాత్రం ఆగడం లేదు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తలతో మెలగాల్సి ఉంటే..ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని చిన్న పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ గ్రామంలో ఐదు సంవత్సరాల గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. అతడిని పోలీసులు పట్టుకున్నారు. బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బేగ్ మంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జీ భరత్ సింగ్ కథనం ప్రకారం…

రైసెన్ జిల్లాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడక్పూర్ గ్రామంలో నివాసం ఉంటున్న బాలిక…వివాహా వేడుకకు హాజరై 2020, జూన్ 26వ తేదీ శుక్రవారం రాత్రి తిరిగి ఇంటికి వెళుతోంది. సంతోష్ సింగ్ ఒంటరిగా వెళుతున్న బాలికను చూశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు.

ఎలాగాలో వివాహం జరిగిన ప్రదేశానికి చేరుకున్న బాలిక..జరిగిన దారుణ విషయాన్ని వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించారు. బేగంగంజ్ సివిల్ ఆసుపత్రి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఓ గుడిసెలో దాక్కున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడపై గతంలో అత్యాచార కేసులున్నాయని బేగ్ మంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జీ భరత్ సింగ్ వెల్లడించారు.