Madhyapradesh : రాక్షస తండ్రి, కూతురిపై హత్యాచారం

కూతురిపై అత్యాచారం జరిపి...అంతమొందించాడు. కులాంతర వివాహం చేసుకోవడమే ఆమె చేసిన తప్పు.

Madhyapradesh : రాక్షస తండ్రి, కూతురిపై హత్యాచారం

Mp

Man Rapes Daughter : ఓ తండ్రి రాక్షసంగా ప్రవర్తించాడు. తాను తండ్రిననే సంగతి మరిచిపోయి..దాష్టీకానికి పాల్పడ్డాడు. కూతురిపై అత్యాచారం జరిపి…అంతమొందించాడు. కులాంతర వివాహం చేసుకోవడమే ఆమె చేసిన తప్పు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో చోటు చేసుకుంది. దారుణానికి పాల్పడిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడవిలో ఉన్న తల్లి, చిన్నారుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read More : Old Age : వృద్ధుల్లో తిన్న ఆహారం ఎందుకు వంటపట్టదో తెలుసా?..

రితాబాద్ పీఎస్ పరిధిలో ఓ యువతి గత సంవత్సరం కులాంతర వివాహం చేసుకుంది. కూతురు పెళ్ళి చేసుకోవడం తండ్రికి ఇష్టం లేదు. ఆ కుటుంబాన్ని వారి కులం నుంచి సాంఘీక బహిష్కరణ చేశారు కుల పెద్దలు. దీంతో తండ్రికి తీవ్ర ఆగ్రహం రావడమే కాకుండా…తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. దీపావళి పండుగ సందర్భంగా…తన నివాసానికి వచ్చిందని, తన 8 నెలల బాబు అనారోగ్యానికి గురై చనిపోయాడని తనతో చెప్పడంతో..ఈ విషయం తన తండ్రికి తెలియచేయడం జరిగిందని సోదరి వెల్లడించింది.

Read More : Pollution : ఫైవ్ స్టార్ హోటల్స్‌‌లో ఉంటూ రైతులపై విమర్శలా ? కాలుష్యంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

బాబుకు అంత్యక్రియలు చేద్దామని కూతురిని అడవికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిపి దారుణంగా చంపేశాడు. అనంతరం ఇంటికి వచ్చాడు. బాబు, తల్లి అదృశ్యంపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం షీ హోర్ జిల్లా అడవుల్లో వారి మృతదేహాలను గుర్తించారు. తండ్రిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అతడిన విచారించారు. చేసిన నేరం అంగీకరించాడు.