Ghaziabad: ప్రియుడితో భార్య వివాహేతర సంబంధం.. ప్రియుడిని చంపి ముక్కలుగా నరికిన భర్త
ఘజియాబాద్కు చెందిన మీలాల్ ప్రజాపతి అనే వ్యక్తి భార్య, స్థానికంగా ఉండే అక్షయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇది గుర్తించిన ప్రజాపతి తన భార్యతో సంబంధం పెట్టుకున్న అక్షయ్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే, వాళ్ల వివాహేతర సంబంధం గురించి తెలియనట్లుగానే ప్రజాపతి ప్రవర్తించాడు.
Ghaziabad: ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్లో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని, ఆమె భర్త హత్య చేశాడు. అంతేకాదు.. అతడి మృతదేహాన్ని ఎనిమిది ముక్కలుగా నరికాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్కు చెందిన మీలాల్ ప్రజాపతి అనే వ్యక్తి భార్య, స్థానికంగా ఉండే అక్షయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది.
Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు
ఇది గుర్తించిన ప్రజాపతి తన భార్యతో సంబంధం పెట్టుకున్న అక్షయ్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే, వాళ్ల వివాహేతర సంబంధం గురించి తెలియనట్లుగానే ప్రజాపతి ప్రవర్తించాడు. ఈ క్రమంలో ఒకరోజు ప్రజాపతి బయటకు వెళ్లిన సమయంలో అక్షయ్ వాళ్లింటికి వెళ్లాడు. అక్కడ ప్రజాపతి భార్య అతడి కోసం టీ రెడీ చేసింది. అయితే, టీ ప్రజాపతి కూతురుపై పడి, గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ప్రజాపతి తన కూతురును ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాడు. తను కూతురుతో ఆస్పత్రిలో ఉండటంతో, ఇంట్లో సహాయం కోసం అక్షయ్ను పిలవాల్సిందిగా తన భార్యకు సూచించాడు.
దీంతో ప్రజాపతి భార్య అక్షయ్ను ఇంటికి పిలిచింది. అక్షయ్ తన ఇంట్లో ఉన్న సమయంలో ప్రజాపతి ఇంటికి చేరుకున్నాడు. అదును చూసి, అక్షయ్ గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అతడి శరీర భాగాల్ని ముక్కలుగా నరికాడు. వాటిని గోనె సంచిలో వేసి, దగ్గర్లోని డంప్ యార్డు వద్ద పడేశాడు. మరుసటి రోజు ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప్రజాపతిని అరెస్టు చేశారు. మృతుడి శరీర భాగాల్ని స్వాధీనం చేసుకున్నారు.