Delhi Murder: ఢిల్లీలో దారుణం.. ముప్పై రూపాయల కోసం వ్యక్తి హత్య.. నిందితుల అరెస్ట్

కొద్ది రోజుల క్రితం రాహుల్ దగ్గర సోనూ కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. తర్వాత రాహుల్ తన డబ్బు తిరిగివ్వమని సోనూను అడిగాడు. అయితే, ఈ డబ్బుకు సంబంధించి రాహుల్, సోనూ మధ్య 30 రూపాయల విషయంలో వివాదం మొదలైంది. ఈ విషయంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది.

Delhi Murder: ఢిల్లీలో దారుణం.. ముప్పై రూపాయల కోసం వ్యక్తి హత్య.. నిందితుల అరెస్ట్

Delhi Murder: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 30 రూపాయల కోసం మొదలైన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనూ (38) అనే వ్యక్తి పెళ్లిళ్లలో క్యాటరింగ్ పని చేసే వాడు.

Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్‌ను ఢీకొన్న ట్రక్కు.. 11 మంది మృతి

అతడితోపాటే రాహుల్ కూడా పని చేసేవాడు. కొద్ది రోజుల క్రితం రాహుల్ దగ్గర సోనూ కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. తర్వాత రాహుల్ తన డబ్బు తిరిగివ్వమని సోనూను అడిగాడు. అయితే, ఈ డబ్బుకు సంబంధించి రాహుల్, సోనూ మధ్య 30 రూపాయల విషయంలో వివాదం మొదలైంది. ఈ విషయంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. కాగా, గురువారం రాహుల్ తన సోదరుడు హరీష్‌తో కలిసి సోనూ దగ్గరకు వెళ్లి డబ్బులు అడిగాడు. ఈ నేపథ్యంలో 30 రూపాయల విషయంలో మళ్లీ గొడవ జరిగింది. సోనూతో, రాహుల్, హరీష్ గొడవపడ్డారు.

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల… మే 7 నుంచి పరీక్షలు ప్రారంభం

ఈ గొడవలో సోనూపై రాహుల్, హరీష్ తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి సోనూపై కత్తితో దాడి చేశారు. అతడి కడుపులో పొడిచారు. దీంతో సోనూ రక్తపు మడుగులో రోడ్డుపై పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని, గాయాలపాలైన సోనూను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.