Bihar : విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురు మృతి, ప్రేమే కారణమా

విషపూరితమైన పదార్థాన్ని సేవించిందన్నారు. మిగతా బాలికలు కూడా విషం తీసుకున్నారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న అనంతరం వారిని

Bihar : విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురు మృతి, ప్రేమే కారణమా

Crime

Six girls Consume Poison : బీహార్ లోని ఔరంగాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒకేసారి ఆరుగురు బాలికలు విషం సేవించారు. వీరిలో ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రేమించిన వ్యక్తి.. పెళ్లికి నిరాకరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔరంగాబాద్ లోని కస్మా పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సోదరుడి బావమరిదిని బాలిక ప్రేమిస్తోందని ఔరంగాబాద్ ఎస్పీ కాంతేశ్ కుమార్ మిశ్రా వెల్లడించారు. శుక్రవారం ఆమె ఐదుగురు స్నేహితులతో కలిసి.. అబ్బాయి వద్దకు వెళ్లి వివాహం విషయాన్ని తెలియచేసింది. కానీ.. ఈ ప్రతిపాదనను అతను తిరస్కరించాడని వెల్లడించారు.

Read More : Accident : ఆర్టీసీ బస్సు ఢీకొని లెక్చరర్ మృతి

అనంతరం వారు తిరిగి ఇంటికి చేరుకున్న అనంతరం బాలిక తీవ్ర నిస్పృహలోకి వెళ్లిందని.. అనంతరం విషపూరితమైన పదార్థాన్ని సేవించిందన్నారు. మిగతా బాలికలు కూడా విషం తీసుకున్నారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న అనంతరం వారిని ఔరంగాబాద్ లోని సదర్ ఆసుపత్రికి తరలించినట్లు..అప్పటికే ముగ్గురు చనిపోయారన్నారు. మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం గయాలోని మగధ మెడికల్ కాలేజీకి తరలించామన్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏరియా సర్కిల్ అధికారులు, ఎస్ హెచ్ వోలు మకాం వేశారన్నారు. కానీ.. మిగతా ఐదుగురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియడం లేదని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వీరి వయస్సు 12 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది.