TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో ఉన్న బంధువులతో గ్రూప్-1 రాయించారు.

TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

TSPSC paper (2)

TSPSC Paper Leakage Case : తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో ఉన్న బంధువులతో గ్రూప్-1 రాయించారు. విదేశాల్లో ఉన్న బంధువులిద్దరిని రప్పించి మరీ గ్రూప్-1 పరీక్ష రాయించారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ దంపతులు ఇక్కడికి వచ్చి పరీక్ష రాయడంపై అప్పట్లోనే వారి స్వగ్రామం జగిత్యాల జిల్లా తాటిపల్లిలో చర్చనీయాంశంగా మారింది.

పరీక్ష రాసిన వారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. రాజశేఖర్ బంధువులు ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయ్యారు. అయితే రాజశేఖర్ ముందే పేపర్ లీక్ చేసి బంధువులకు ఇచ్చాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వారికి కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులు ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు 6 రోజుల పోలీస్ కస్టడీ

వారందరినీ ఆరు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో చంచల్ గూడ్ జైలు నుంచి 9 మంది నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. వారందరికీ కింగ్ కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏ1 ప్రవీణ్ కుమార్ తో పాటు, ఏ2గా ఉన్న అట్ల రాజశేఖర్, ఏ3గా రేణుకా రాథోడ్, ఏ4గా ఉన్న డాక్యా, ఏ5గా ఉన్న కేతావత్ రాజేశ్వర్, ఏ6గా ఉన్న కేతావత్ నీలేశ్ నాయక్, ఏ7గా ఉన్న గోపాల్ నాయక్, ఏ8గా ఉన్న కేతావత్ శ్రీనివాస్, ఏ9గా ఉన్నటువంటి కేతావత్ రాజు నాయక్ ను చంచల్ గూడ జైలు నుంచి సిట్ అధికారులు పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు.

వైద్య పరీక్ష కంప్లీట్ అయిన తర్వాత సిట్ కార్యాలయానికి తరలించి అక్కడే ఆరు రోజులపాటు పూర్తిగా విచారించి వారి స్టేట్ మెంట్ ను నమోదు చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేసులో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారని ఇప్పటికే సిట్ కొన్ని ఆధారాలు సేకరించారు. అతని ద్వారా పేపర్ లీక్ అయినట్లు సిట్ అధికారులు అన్నీ ఎవిడెన్స్ సేకరించారు. గతంలో కూడా రాజశేఖర్ అనేక పేపర్లను లీక్ చేశారు. విదేశాల్లో ఉన్న తన బంధువులను సైతం తీసుకొచ్చి ఇక్కడ గ్రూప్-1 ఎగ్జామ్ రాయించినట్లు కొన్ని ఆధారాలను అధికారులు సేకరించారు.